Maha Kumbh Mela 2025: కుంభమేళా ప్రాంతంలో మళ్లీ మంటలు.. రెండు వాహనాలు దగ్ధం
- మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం.
- ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధం.
- మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అక్కడ జొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, సకాలంలో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక అధికారులు. సమాచారం ప్రకారం.. కుంభమేళా ప్రాంతంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలో ఆగి ఉన్న రెండు వాహనాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Also Read: Dead Body On Bicycle: సైకిల్పై 15 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
అయితే, ఘటన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఏకాదశి కావడంతో ఈరోజు మహాకుంభానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. గతంలో జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా కుంభ్ నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అగ్నిప్రమాదాలు, ప్రమాదాల నివారణకు కుంభమేళాలో పలు చోట్ల స్పాట్లు ఏర్పాటు చేశారు. తద్వారా ఏదైనా సంఘటన జరిగితే సత్వరమే స్పందించవచ్చు.
Also Read: Mamatha Kulakarni: మహా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..
ఈ కారణంగా, ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అగ్నిమాపక దళం సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే కారులోని వ్యక్తులను ఖాళీ చేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వాహనాలను ఇక్కడే పార్క్ చేశారని ఫైర్ ఆఫీసర్ విశాల్ యాదవ్ తెలిపారు. అయితే ఇక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగాయని, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని తెలిపారు. ఈ ఘటనలో ఓ ఎర్టిగా కారు పూర్తిగా, ఓ వెన్యూ కారు పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!