Pakistan: పాకిస్థాన్లోనూ బంగ్లాదేశ్లా తిరుగుబాటు భయం! ఆర్మీ చీఫ్ హెచ్చరిక
- ప్రభుత్వాన్ని కూల్చేసిన విద్యార్థుల నిరసనలు
- షేక్ హసీనా ప్రభుత్వాన్ని చిన్నభిన్నం
- దేశం వదిలి పారిపోయిన ప్రధాని
- దీంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
- పాకిస్థాన్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు!
- ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గట్టి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు దేశం బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని చిన్నభిన్నం చేశాయి. ప్రధాని దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. పాకిస్థాన్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్లో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ హెచ్చరిస్తూ.. దేశ భద్రత, జాతీయ సమగ్రతను కాపాడేందుకు తమ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందున అలాంటి కుట్రలను విజయవంతం చేయనివ్వబోమని చెప్పారు.
READ MORE: Manish Sisodia Bail: మనీష్ సిసోడియాకు ఊరట.. 17 నెలల తర్వాత బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Also Read
మతపెద్దల సదస్సులో జనరల్ మునీర్ మాట్లాడుతూ.. “పాకిస్థాన్లో ఎవరైనా ఇలాంటి అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తే, అల్లాపై ప్రమాణం చేస్తున్నాను.. మేము అది విజయవంతం చేయనివ్వం. ప్రపంచంలో ఏ శక్తీ పాకిస్థాన్కు హాని చేయదు ఎందుకంటే ఈ దేశం ప్రపంచం అంతమయ్యే వరకు ఉంటుంది. దేశం ఎంత ముఖ్యమో తెలియాలంటే ఇరాక్, సిరియా, లిబియాలను చూడాలి.” అని పేర్కొన్నారు. దేశంలో శాంతి, అస్థిరతలను నెలకొల్పడంలో సైన్యం అంకితభావంతో ఉందని కొనియాడారు. దేశంలో అరాచకం వ్యాప్తి చెందడానికి సోషల్ మీడియానే కారణమన్నారు.
READ MORE:Sunkishala Project: నేడు సుంకిశాల ప్రాజెక్టును సందర్శించనున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
కశ్మీర్ అంశంపై మునీర్ ఏమన్నారు?
కశ్మీర్ వివాదం భారత్-పాక్ల మధ్య అపరిష్కృత ఎజెండా అని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ అన్నారు. దీన్ని పరిష్కరించాలని ఆయన కోరారు. పాకిస్థాన్ చాలా కాలంగా ఆఫ్ఘన్ శరణార్థులకు మద్దతు ఇస్తోందని.. ఆఫ్ఘనిస్తాన్ -పాక్ మధ్య శాంతియుత సంబంధాలను కొనసాగించాలని ఆయన నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?