Site icon NTV Telugu

Father Kills Daughters: తండ్రి కాదు రాక్షసుడు.. కవల పిల్లలను హత్య చేసి స్వయంగా పోలీసులకు ఫోన్..

Kanpur Murder Case

Kanpur Murder Case

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. అభంశుభం తెలియని చిన్నారుల మరణశాసనం రాశాడు. కవల కూతుర్లను గొంతు కోసి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 48 ఏళ్ల వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున తన ఫ్లాట్‌లో పదునైన ఆయుధంతో తన 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడైన, మెడికల్ రిప్రజెంటేటివ్ శశి రంజన్ మిశ్రా, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన కుమార్తెలను హత్య చేసినట్లు తెలియజేశాడు. బీహార్ నివాసి అయిన అతను తన భార్య రేష్మా, వారి కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు.

Also Read:Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు జరపడమేంటి..? భారత్ నౌకపై ఇరాన్ కాల్పులు..

శనివారం రాత్రి భోజనం చేశాక శశి అమ్మాయిలను పడుకోబెట్టాడని పిల్లల తల్లి చెప్పింది. తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు అతను కూతుళ్లలో ఒకరిని స్నానాల గదికి తీసుకెళ్లాడని, ఆ తర్వాత వాళ్లు గదికి తిరిగి రాగా లైట్లు ఆర్పేశాడని తెలిపింది. రెండు గంటల తర్వాత, అతను పోలీసుల అత్యవసర సేవా నంబర్‌కు ఫోన్ చేసి, తాను పిల్లలను హత్య చేసినట్లు తెలిపాడు. వెంటనే ఫ్లాట్‌కు చేరుకున్న పోలీసులు, లోపల శశి ఉండగా, ఇద్దరు అమ్మాయిలు గొంతులు కోసి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. తండ్రిని అరెస్టు చేశాం, కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి విలేకరులకు వెల్లడించారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడి భార్య ఇచ్చిన వాంగ్మూలం ఈ విషయాన్ని మరింత తీవ్రతరం చేసింది. భార్య చెప్పిన ప్రకారం, 2014లో వారిది ప్రేమ వివాహం. ఆమె పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందినది కాగా, ఆమె భర్త బీహార్‌కు చెందినవాడు. వీరిద్దరూ కాన్పూర్‌లో కలిసి పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. పెళ్లయిన కొద్దికాలానికే వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయని తెలిపింది.

Also Read:Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!

తన భర్త తరచుగా మద్యం సేవించి తనపై శారీరకంగా దాడి చేసేవాడని రేష్మా చెప్పింది. పుట్టింటికి కూడా పంపేవాడు కాదని ఆరోపించింది. కనీసం బయటకు కూడా వెళ్లనిచ్చేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు కుమార్తెలను తనతోనే ఉంచుకుంటానని పట్టుబట్టి, కొడుకును తీసుకుని వేరే చోటికి వెళ్ళమని తన భర్త పదేపదే చెప్పాడని ఆమె ఆరోపిస్తోంది.

Exit mobile version