Kangana Ranaut : కంగనా రనౌత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన రైతులు.. అడ్డుకున్న పోలీసులు.. వీడియో వైరల్
- కంగనా రనౌత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన రైతులు
- అడ్డుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని హాపూర్లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై భారతీయ కిసాన్ యూనియన్ (లోఖిత్) యునైటెడ్ కిసాన్ మోర్చా నిరసన వ్యక్తం చేసింది. రైతులు నిరసన ప్రదర్శన చేపట్టిన తర్వాత, కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఢిల్లీ-లక్నో రహదారిని దిగ్బంధించి అక్కడే బైఠాయించారు. దిష్టిబొమ్మ విషయంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు దిష్టిబొమ్మను లాక్కున్నారు. హాపూర్ నగర్లో రైతులు, పోలీసుల మధ్య జరిగిన దిష్టిబొమ్మల వాగ్వాదం యొక్క చిత్రాలు తహసీల్ చౌపల్లె నుంచి వెలువడ్డాయి. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటని భారతీయ కిసాన్ యూనియన్ లోఖిత్ జాతీయ అధికార ప్రతినిధి హరీష్ హూన్ అన్నారు. కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు దిష్టిబొమ్మను బలవంతంగా లాక్కొని పారిపోయారన్నారు. ఎంపీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: FEMA violation case: డీఎంకే ఎంపీకి షాక్.. రూ.908 కోట్లు జరిమానా
Also Read
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
అసలేం జరిగిందంటే.. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతులు చేసిన ఆందోళనపై బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని ఇటీవల ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఈ వీడియోను ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నారు. రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడుతూ ఉండేవని, అత్యాచారాలు జరిగేవని కంగన ఆరోపించారు. ఉద్యమం వెనుక చైనా, అమెరికాల కుట్ర ఉందని చెప్పారు. దీనిపై విపక్షాలు, అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్ర ఆక్షేపణ తెలిపాయి. ఆమె వ్యాఖ్యలు యావద్దేశంలో రైతుల్ని తీవ్రంగా అవమానించేవిగా ఉన్నాయని ఇటీవల లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ మండిపడ్డారు. తాజాగా రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
कंगना के पुतले पर TUG OF WAR
हापुड़ : कंगना रनौत का पुतला फूंकने जा रहे किसान से पुतला लेकर भागी पुलिस, वीडियो वायरल#UttarPradesh | #kanaganaranaut | #Farmers | #UPPolice | #viralvideo pic.twitter.com/g7hEpPU8qG
— NDTV India (@ndtvindia) August 28, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!