Bharat Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్.. రైలు పట్టాలపై పడుకొని రైతన్న నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers protest: నేడు భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్తి కిసాన్ మోర్చా పిలుపు మేరకు మరో 11 డిమాండ్ల కోసం రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ భారత్ బంద్ కొనసాగనుంది. అయితే, ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. పంజాబ్లోని చాలా చోట్ల రైతులు రైలు పట్టాలపై పడుకుంటున్నారు. రైతుల ఈ ఉద్యమం కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. పంజాబ్ లోని లూథియానా- సాహ్నేవాల్- చండీగఢ్ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించారు.
Read Also: Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఇక, ఈ దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పనులు మూసివేయాలని కోరారు. చాలా చోట్ల హైవేలపై ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్ బంద్కు సంబంధించి ఢిల్లీ పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిఘా పెంచారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించడంతో పాటు సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Karnataka: పెళ్లం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని భర్త సూసైడ్..
అయితే, భారత్ బంద్ ప్రభావం మొదలైంది.. దేశంలోని చాలా చోట్ల రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధనాలు చేస్తున్నారు. పంజాబ్లో మూడు వేల ప్రభుత్వ బస్సుల రాకపోకలను నిలిపివేసింది. అయితే, అంబులెన్స్లు, పెళ్లిళ్ల వాహనాలు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఈ భారత్ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కోరారు. కాగా, మరోసారి ఆదివారం రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నాలుగో రౌండ్ చర్చలు జరగాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!