Fake Seeds: మంచిర్యాలలో రెచ్చిపోతున్న నకిలీ విత్తన మాఫియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Seeds: సీజన్ ప్రారంభ కాకముందే ఫేక్ సీడ్స్ ముఠాలు రంగంలోకి దిగాయి..అమాయక రైతులను ముంచేందుకు రెడి అయ్యారు. నాణ్యతలేని విత్తనాలను అంటగట్టే ముఠాలు మళ్లీ తమ పనికానిచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో క్వింటాళ్ల కొద్ది నకిలీ విత్తనాలు సరఫరా ఏటా నిత్యకృత్యంగానే మారిపోతున్నాయి. అయితే ఇందులోపాత్రదారులెవ్వరు.. సూత్రదారులెవ్వరు… సహకరించే వ్యవస్థ ఎక్కడుంది..అన్నదాతను నిండాముంచుతున్న ఫేక్ సీడ్స్ కేటుగాళ్లపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా నకిలీ విత్తనాలు రైతన్నలను కష్టాలపాలు చేస్తుంది. దిగుబడి రాక కొంతమంది పెట్టిన విత్తనాలు మొలకెత్తక మరికొంతమంది నష్టపోతూనే ఉన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే విత్తన మాఫియా జిల్లాలో జడలువిప్పుతోంది. వేసవి ప్రారంభం కంటే ముందే లూజ్ విత్తనాలు డంప్ చేసుకుని మరీ తమ ఆగడాలకు పదునుపెడుతున్నారు. ముఠాలుగా ఏర్పడి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా తాండూర్ లో ఓ ముఠా టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. స్టేషన్ పోలీసులు ఉన్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రమే పట్టుకోవడం అనుమానాలకు తావిస్తోంది. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిదిలో క్వింటాళ్ల కొద్ది ఫేక్ సీడ్స్ వ్యాపారం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గతంలో భారీ సంఖ్యలో పట్టుకుని సీజ్ చేసి నిందితులపై కేసులు పెట్టినా.. ఆఖరికి పీడీ యాక్టులు సైతం అమలు చేసినా బుద్ధి మారలేదు కొందరికి.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also: Etala Rajender: కేసీఆర్ మాటలకు పొంగిపోను.. అవమానాలను మర్చిపోను
తాజాగా తాండూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు బొలెరా వాహనంలో పైన వడ్ల బస్తాలు.. లోపల నకిలీ పత్తివిత్తనాలు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గింజల వాహనానికి ముందుగా పైలెట్ వాహనం సైతం ఏర్పాటు చేసుకున్నారు. రెండు వాహనాలు 5 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేశారు. అయితే ఇందులో మరో ఇద్దరు పరారీలో ఉండగా అందులో ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు సైతం ఉన్నాడు.
Read Also: Gold Chain Robbery: దొరలా వచ్చి గోల్డ్ చెయిన్ కాజేసిన కేటుగాడు
ఏటా కొన్ని ముఠాలు కొంతమంది రైతులను మచ్చిక చేసుకుని వాళ్ల ద్వారా సేల్స్ చేస్తున్నారు. ఏదైనా అయితే రైతులే అని చెప్పే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఆంధ్రాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ రైతులను మచ్చిక చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. గతంలో పోలీసులు చాలామందిని అరెస్ట్ చేశారు. అలాగే రైతులను ముందుపెట్టి నకిలీ సీడ్స్ తో మోసం చేసే ముఠాలకు సహకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ సీడ్స్ ముఠాలను అరికట్టాల్సిన అధికారులు మిన్నకుండి పోవడంతో అన్నదాత నిండామునుగుతున్నాడు. అయితే నకిలీ సీడ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు చెప్పుతున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!