Success Story: ఉద్యోగాన్ని వదిలి.. భూమిని నమ్మాడు.. రూ.కోటి సంపాదిస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success Story: మధ్యప్రదేశ్లో రైతులు ఆవాలు, గోధుమలు, పప్పులను మాత్రమే పండిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇది అలా కాదు. ఇక్కడ రైతులు ఆధునిక పద్ధతుల్లో నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది. నర్సరీ వ్యాపారం ద్వారా చాలా మంది రైతులు లక్షాధికారులుగా మారారు. ఈ రైతుల్లో ఓం ప్రకాష్ పాటిదార్ ఒకరు. ఈరోజు ఖర్గోన్ జిల్లాలోని ధనిక రైతుల్లో ఆయనను లెక్కించారు. వ్యవసాయం చేసి కోటీశ్వరుడయ్యాడు. ఓం ప్రకాష్ పాటిదార్ మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లోని నాంద్రా గ్రామ నివాసి. గతంలో నెలకు రూ.12 వేల జీతంతో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కానీ అంత తక్కువ జీతంతో ఇంటి ఖర్చులు భరించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతను తోటపని ప్రారంభించాడు. నేడు పాలీ హౌస్లో పచ్చని కూరగాయల మొక్కలను పెంచుతున్నాడు. దీంతో ఒక్క సీజన్లోనే లక్షల రూపాయల లాభం పొందుతున్నాడు. విశేషమేమిటంటే ఓం ప్రకాష్ 40 మందికి ఉపాధి కూడా కల్పించారు. అతని నర్సరీలో ప్రతిరోజూ 40 మంది కూలీలు పనిచేస్తున్నారు.
Also Read
తన తండ్రి సంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేసేవారని.. దాని వల్ల పెద్దగా ఆదాయం రాలేదని రైతు ఓం ప్రకాశ్ చెబుతున్నాడు. కానీ అతను ఆధునిక పద్ధతులలో నర్సరీ వ్యవసాయం ప్రారంభించినప్పుడు.. అతని ఆదాయం పెరగడం ప్రారంభమైంది. ముందుగా రూ.28.40 లక్షలతో నాలుగు వేల చదరపు మీటర్లలో పాలీ హౌస్ నిర్మించి పలు రకాల కూరగాయల మొక్కలను నాటారు. ఆదాయం పెరగడంతో ఓం ప్రకాష్ షెడ్నెట్ హౌస్ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోయాడు. ప్రస్తుతం నాలుగున్నర ఎకరాల్లో షెడ్నెట్ హౌస్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. షెడ్నెట్ హౌస్లో వారు సంవత్సరానికి నాలుగు సార్లు వివిధ సీజన్లలో వివిధ కూరగాయల మొక్కలను సిద్ధం చేస్తారు. ఓం ప్రకాష్ ప్రతి సీజన్లో మొక్కలు అమ్మడం ద్వారా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇలా షాడెనెట్ హౌస్ టెక్నాలజీ ద్వారా మొక్కలు అమ్ముతూ ఏడాదిలో రూ.కోటి సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఓం ప్రకాష్ నర్సరీలో మిరప, బొప్పాయి, పుచ్చకాయ, టమాటా, బెండకాయ, క్యాబేజీ మొక్కలు పెరుగుతున్నాయి. ఇవి ఒక సీజన్లో దాదాపు 22 నుంచి 25 లక్షల మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. వారు బర్వానీ, ఖర్గోన్, ధార్, శివపురి మరియు ఇతర రాష్ట్రాలకు మొక్కలను సరఫరా చేస్తారు.
Read Also:Pragyananda Meet PM: ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!