Tomato: టమాటాలు అమ్మి.. రూ.1.5 కోట్ల అప్పు తీర్చిన రైతు.! తాను ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato: పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కానీ కూరగాయలు పండించే రైతులు మాత్రం లక్షాధికారులు అవుతున్నారు. చాలా మంది రైతులు కూరగాయలు అమ్మి ధనవంతులయ్యారు. ముఖ్యంగా టమాటా ఉత్పత్తి చేసే రైతుల ఆదాయం ఈ ద్రవ్యోల్బణంలో చాలా రెట్లు పెరిగింది. దేశంలో చాలా మంది రైతులు టమాటాలు అమ్మి కోటీశ్వరులుగా మారారు. ఈ రైతుల్లో 48 ఏళ్ల మురళి అనే రైతు ఒకరు. కొద్ది రోజుల్లోనే టమాటా అమ్మి రూ.4 కోట్లు సంపాదించాడు మురళి. దీంతో దేశ వ్యాప్తంగా మురళి చర్చనీయాంశంగా మారారు.
సమాచారం మేరకు రైతు మురళి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వాసి. చాలా కాలంగా స్వగ్రామంలో టమాట సాగు చేస్తున్నాడు. అయితే ఇంతకు ముందు అతను ఇంత లాభం పొందలేదు. గతేడాది ధరల పతనంతో రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లింది. వడ్డీ వ్యాపారి వద్ద అప్పు చేసి వ్యవసాయం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.5 కోట్ల అప్పుల పాలయ్యాడు. అయితే ఈ ఏడాది టమాటాలు అమ్మి ధనవంతుడయ్యాడు. ధర ఎక్కువగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే టమాటా అమ్మి రూ.4 కోట్లు సంపాదించాడు.
Also Read
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
- Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
- Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
Read Also:Redmi 12 5G Launch: 11 వేలకే రెడ్మీ 5జీ స్మార్ట్ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ!
45 రోజుల్లో రూ.2 కోట్లు
విశేషమేమిటంటే ఇంత భారీ మొత్తం సంపాదించడానికి మురళి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. టమాటాలు అమ్మేందుకు రోజూ 130 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. మంచి ధర వస్తుందని కోలార్కు టమాటా అమ్మేందుకు వెళ్లేవాడు. విశేషమేమిటంటే.. రూ.1.5 కోట్ల అప్పు తీర్చిన మురళి కేవలం 45 రోజుల్లోనే రూ.2 కోట్లు రాబట్టగలిగాడు.
భూమిని కొనాలని చూస్తున్నాడు
ఈ లాభంతో మురళి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు మరింత విస్తీర్ణంలో టమాట సాగు చేయాలని యోచిస్తున్నాడు. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతులు పాటించి ఉద్యాన పద్దతిలో టమోటా సాగు చేయాలని, తద్వారా మంచి దిగుబడి రావాలన్నారు. విశేషమేమిటంటే, ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేసేందుకు గ్రామంలోనే ఎక్కువ భూమిని కొనుగోలు చేయాలని మురళి యోచిస్తున్నాడు.
Read Also:Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్ఫారమ్పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
రూ.18-20 లక్షల నష్టం
ఇంతకుముందు మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన ఈశ్వర్ గయ్కర్ అనే రైతు టమాటాలు అమ్మడం ద్వారా రూ. 2.8 కోట్లు సంపాదించాడు. ఈశ్వర్ గయ్కర్ కూడా గత 7 సంవత్సరాలుగా 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాడు. కానీ అతను ఎప్పుడూ ఇంత సంపాదించలేదు. ఇంతకు ముందు పలుమార్లు టమోటా సాగులో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. 2021లో టమాటా సాగులో ఈశ్వర్ గయ్కర్ రూ.18-20 లక్షల నష్టం చవిచూశారు.
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?