Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్ఫారమ్పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉన్నాయి. దూర ప్రయాణాలు నేటికీ రైల్వేలే ప్రధాన ఆధారం. ఇది సౌకర్యవంతంగా, చౌకగా ఉండటమే దీనికి కారణం. అయితే రైలు ప్రయాణంలో చాలా నియమాలు కూడా పాటించాలి. ప్లాట్ఫారమ్పై రైలు కోసం వేచి ఉండాలనే నిబంధన కూడా ఉంది. దీని గురించి అందరికీ తెలియదు. ఈ నియమాలను పాటించనందుకు మీరు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. మీరు జరిమానా చెల్లించాల్సిన రైల్వే నియమం గురించి తెలుసుకుందాం..
Read Also:WI vs IND 3rd ODI: వెస్టిండీస్పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ప్రజలు రైలులో ప్రయాణించడానికి సమయానికి ముందే రైల్వే స్టేషన్, ప్లాట్ఫారమ్కు చేరుకోవడం మీరు తరచుగా చూసి ఉంటారు. అయితే టికెట్ తీసుకున్న తర్వాత కూడా ప్లాట్ఫారమ్పై నిరీక్షించే సమయం ఉంటుంది. ఒకవేళ పాటించకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, రైలు టికెట్ తీసుకున్న తర్వాత మీరు ప్లాట్ఫారమ్కు చేరుకున్నప్పుడు అక్కడ ఉండడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమం పగలు, రాత్రి ఆధారంగా ఉంటుంది. మీ రైలు రోజులో ఉంటే మీరు రైలు సమయానికి రెండు గంటల ముందు స్టేషన్కు చేరుకోవచ్చు. మీ రైలు రాత్రిపూట ఉంటే మీరు రైలు రాకకు 6 గంటల ముందు స్టేషన్కు చేరుకోవచ్చు. ఈ సమయంలో చేరుకున్నప్పుడు మీరు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. రైలులో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా ఇదే నియమం వర్తిస్తుంది. రైలు వచ్చిన తర్వాత గరిష్టంగా 2 గంటల వరకు మీరు స్టేషన్లో ఉండగలరు. అయితే రాత్రి సమయమైతే 6 గంటల పాటు ఉండేందుకు రైల్వే అనుమతిస్తుంది.
Read Also:Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా.. నిజమేంటంటే?
ఈ నియమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి TTE డిమాండ్పై రైలు టిక్కెట్ను చూపించడం అవసరం. నిర్ణీత సమయానికి మించి రైల్వే స్టేషన్లో బస చేస్తే ప్లాట్ఫారమ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పగటిపూట రైలు సమయం నుండి 2 గంటలకు పైగా.. రాత్రి రైలు సమయం నుండి 6 గంటలకు మించి స్టేషన్లో ఉంటే మీరు ప్లాట్ఫారమ్ టికెట్ తీసుకోవాలి. మీరు దీన్ని చేయకపోతే TTE మీకు జరిమానా విధించవచ్చు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!