తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2018, పద్మినీ, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్క్వాడ్ ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షక ఆదరణ దక్కించుకున్నాయి.అయితే ప్రతివారం ఏదో ఒక మలయాళ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటుంది.ఇక్కడి ప్రేక్షకుల కోసం తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.తాజాగా మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జయ జయ జయహే మూవీ ఫేమ్ బసిల్ జోసెఫ్ నటించిన ‘ఫలిమీ’. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ను ఎంతగానో మెప్పించింది. థియేటర్లలో ఎంతగానో మెప్పించిన ‘ఫలిమీ ‘ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ మరియు కన్నడ భాషల్లోనూ ఈ స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చేసింది. నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఫలిమీ మూవీలో బసిల్ జోసెఫ్ తో పాటు జగదీశ్, మంజూ పిళ్ళై, సందీప్ ప్రదీప్, మీనరాజ్ మరియు రైనా రాధాకృష్ణ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.ఫలిమీ కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో తీసిన రోడ్ జర్నీ మూవీ ఇది. అనూప్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంటాడు. ఇంట్లో ఖాళీగా ఉండే తండ్రి, ఒక ప్రింటింగ్ ప్రెస్లో పని చేసే తల్లి, అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే తమ్ముడు మరియు కాశీకి పోవాలని ప్రయత్నాలు చేసే తాతయ్య.. ఇది అనూప్ ఫ్యామిలీ స్టోరీ. 15 మంది అమ్మాయిలను చూసిన తర్వాత అనూప్ కు పెళ్లి కుదురుతుంది. అయితే నిశ్చితార్థం రోజున జరిగిన ఒక సంఘటనతో ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కాశీ కి వెళ్లిపోతారు. మరి కాశీ ప్రయాణంలో అనూప్ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే ఈ సినిమా కథ..