PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కుటుంబానికి రూ. 78,000.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Surya Ghar Muft Bijli Yojana: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ యోజన కింద సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ. 78,000లను అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ. 75,021 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రధాని మోడీ ఫిబ్రవరి 13న ప్రారంభించారు. ఈ పథకం కుటుంబాలకు సహాయం చేయడమే కాకుండా సౌరశక్తి విడిభాగాల దేశీయ తయారీకి ఊతమిస్తుందని, 17 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుందని మంత్రి చెప్పారు.
Also Read
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
Read Also: Naga Babu: 5 అడుగుల మూడు అంగుళాల హీరో గురించి మాట్లాడడం తప్పే.. క్షమించండి
సోలార్ విద్యుత్ పెంచే లక్ష్యం:
సబ్సిడీ కింద కోటి కుటుంబాలకు రూ. 78,000 రాయితీ అందించనునంది. మిగిలిన మొత్తాన్ని సదరు ఇంటి యజమాని భరించలేని పక్షంలో వారికి బ్యాంకు ద్వారా రుణం అందించనున్నారు. ఎండ ఉన్న రోజులో 1 kW సౌర విద్యుత్ ప్లాంట్ ఒక రోజులో 4 నుండి 5.5 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు.
ఈ పథకం కింది రూప్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థ కోసం కేంద్రం 2 కిలోవాట్ సిస్టమ్ ఖర్చులో 60 శాతం, 2-3 కిలోవాట్ల మధ్య ఉన్న సిస్టమ్కి రూ. 40 శాతం అదనపు ఖఱర్చు ఇవ్వబడుతుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థిక సాయం 3 కిలోవాట్ల వరకే పరిమితం చేయబడుతుంది.
దీని ప్రకారం .. 2 KW సోలార్ ప్యానెల్ కెపాసిటీ కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ఇళ్లకు కిలోవాట్కి రూ. 30,000 చొప్పున సబ్సిడీ ఉండనుంది. 3 కిలోవాట్లకు వరకు అదనపు సామర్థ్యం కోసం మరో కిలోవాట్కి రూ. 18,000 సబ్సిడీగా ఇవ్వనుంది.
దరఖాస్తుదారులు ఆన్లైన్లో https://pmsuryaghar.gov.in/consumerRegistrationlలో నమోదు చేసుకోవచ్చు, అర్హత ఉన్న కుటుంబాలు ఇన్స్టాలేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పంపిణీ సంస్థ(డిస్కమ్) సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆమోదం తెలుపుతుంది.
తాజావార్తలు
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..