Fact Check: ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ‘పోర్న్ లెటర్’.. స్పందించిన ప్రభుత్వం
- ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో నకిలీ లేఖ
- వైరల్ అవుతున్న ఈ 'పోర్న్ లెటర్'?
- స్పందించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో నకిలీ లేఖ పంపడంపై కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఈమెయిల్ ద్వారా ప్రజలకు పంపుతున్న లేఖ నకిలీదని తెలిపింది. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఈ లేఖను పంపుతున్నారు. ఈ ‘పోర్న్ లెటర్’ పంపింది ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కాదు. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఉన్న ఈ లేఖ ఇంటర్నెట్ ఐపీ ట్రాఫిక్కు వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్ గురించి చెబుతుంది. అసభ్యకరమైన విషయాలను చూసేందుకు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని ఇందులో ఆరోపించారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ నకిలీ లేఖను ఎక్స్లో పోస్ట్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక హ్యాండిల్ ఈ వైరల్ లేఖను ఖండించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్… ఈ ఇమెయిల్ నకిలీదని ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపింది. మీరు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను చేయాలనుకుంటే cybercrime.gov.inలో చేయాలని సూచించింది.
READ MORE: Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
ఈ లేఖలో ఏం ఉంది?
భారతీయ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రాసిక్యూటర్ ప్రశాంత్ గౌతమ్ నుంచి వచ్చినట్లు క్లెయిమ్ చేస్తూ.. లేఖలో ఇలా రాశారు. “ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డిపార్ట్మెంట్ తరపున మీ ఇంటర్నెట్ ఐపీ ట్రాఫిక్కు వ్యతిరేకంగా క్లోజ్డ్ కోర్ట్ ఆర్డర్ గురించి మీకు తెలియజేయడానికి ఈ సమాచారం పంపుతున్నాం. మీరు మీ అధికారిక లేదా ప్రైవేట్ ఇంటర్నెట్ను అసభ్యకరమైన విషయాలను చూసేందుకు వేదికగా మార్చుకోవడం చాలా దురదృష్టకరం. మా లేబొరేటరీలు అత్యాధునిక స్పైడర్/క్రాలింగ్ డిజిటల్ సాఫ్ట్వేర్, పరికరాలతో అమర్చబడి ఉన్నాయి. ఇవి హార్డ్ డిస్క్లు మరియు మొబైల్ ఫోన్ల నుంచి తొలగించబడిన డేటాను సంగ్రహించడం, ఇమేజింగ్, హాష్ విలువ లెక్కలు, ఫోరెన్సిక్ సర్వర్లు, ఆన్-సైట్ పరిశోధన కోసం పోర్టబుల్ ఫోరెన్సిక్ సాధనాలు వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఆధునిక ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్తో పాటు చైనీస్ ఫోన్ల నుంచి డేటాను సంగ్రహించే సదుపాయం ఉంది. నోటీసు అందిన 24 గంటల్లోగా సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని లేఖలో బెదిరించారు.
- Tags
తాజావార్తలు
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..