Fact Check: ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ‘పోర్న్ లెటర్’.. స్పందించిన ప్రభుత్వం
- ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో నకిలీ లేఖ
- వైరల్ అవుతున్న ఈ 'పోర్న్ లెటర్'?
- స్పందించిన ప్రభుత్వం
ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో నకిలీ లేఖ పంపడంపై కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఈమెయిల్ ద్వారా ప్రజలకు పంపుతున్న లేఖ నకిలీదని తెలిపింది. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఈ లేఖను పంపుతున్నారు. ఈ ‘పోర్న్ లెటర్’ పంపింది ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కాదు. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఉన్న ఈ లేఖ ఇంటర్నెట్ ఐపీ ట్రాఫిక్కు వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్ గురించి చెబుతుంది. అసభ్యకరమైన విషయాలను చూసేందుకు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని ఇందులో ఆరోపించారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ నకిలీ లేఖను ఎక్స్లో పోస్ట్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక హ్యాండిల్ ఈ వైరల్ లేఖను ఖండించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్… ఈ ఇమెయిల్ నకిలీదని ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపింది. మీరు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను చేయాలనుకుంటే cybercrime.gov.inలో చేయాలని సూచించింది.
READ MORE: Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
ఈ లేఖలో ఏం ఉంది?
భారతీయ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రాసిక్యూటర్ ప్రశాంత్ గౌతమ్ నుంచి వచ్చినట్లు క్లెయిమ్ చేస్తూ.. లేఖలో ఇలా రాశారు. “ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డిపార్ట్మెంట్ తరపున మీ ఇంటర్నెట్ ఐపీ ట్రాఫిక్కు వ్యతిరేకంగా క్లోజ్డ్ కోర్ట్ ఆర్డర్ గురించి మీకు తెలియజేయడానికి ఈ సమాచారం పంపుతున్నాం. మీరు మీ అధికారిక లేదా ప్రైవేట్ ఇంటర్నెట్ను అసభ్యకరమైన విషయాలను చూసేందుకు వేదికగా మార్చుకోవడం చాలా దురదృష్టకరం. మా లేబొరేటరీలు అత్యాధునిక స్పైడర్/క్రాలింగ్ డిజిటల్ సాఫ్ట్వేర్, పరికరాలతో అమర్చబడి ఉన్నాయి. ఇవి హార్డ్ డిస్క్లు మరియు మొబైల్ ఫోన్ల నుంచి తొలగించబడిన డేటాను సంగ్రహించడం, ఇమేజింగ్, హాష్ విలువ లెక్కలు, ఫోరెన్సిక్ సర్వర్లు, ఆన్-సైట్ పరిశోధన కోసం పోర్టబుల్ ఫోరెన్సిక్ సాధనాలు వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఆధునిక ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్తో పాటు చైనీస్ ఫోన్ల నుంచి డేటాను సంగ్రహించే సదుపాయం ఉంది. నోటీసు అందిన 24 గంటల్లోగా సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని లేఖలో బెదిరించారు.
- Tags
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!