Fake IT Jobs: ఫేక్ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి యువతను మోసం చేసిన నిందితుడు అరెస్ట్
- మాదాపూర్లో భారీగా ఐటీ ఉద్యోగాల మోసం వెలుగులోకి.
- నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో నకిలీ ఐటీ కంపెనీ ఏర్పాటు
- ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన కాలువ భార్గవ్
- నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను మోసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake IT Jobs: హైదరాబాద్ మాదాపూర్లో భారీగా ఐటీ ఉద్యోగాల మోసం బయటపడింది. నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో నకిలీ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన కాలువ భార్గవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భార్గవ్ గతంలో ఓ ఐటీ కంపెనీలో HR (హ్యూమన్ రిసోర్స్) గా పనిచేసిన అనుభవం ఉంది. రిక్రూట్మెంట్ ప్రక్రియ, ఉద్యోగ నియామకాలపై పూర్తిగా అవగాహన కలిగిన ఇతను, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేయడం మొదలుపెట్టాడు.
Read Also: New CEC Gyanesh Kumar: కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్.. ఆమోదించిన రాష్ట్రపతి
Also Read
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
నిరుద్యోగుల వివరాలను సేకరించేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల నుంచి రెస్యూమ్లు కొనుగోలు చేసి, వారికి జాబ్ ఆఫర్లు వచ్చాయని మెయిల్స్ పంపేవాడు. అనంతరం, ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగం పొందేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవాడు. “బ్యాక్డోర్ ఉద్యోగాలు” అనే పేరు చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసాడు భార్గవ్. ఇలా చాలామందికి ఆశలు పెట్టి నిరుద్యోగుల నుండి డబ్బులను వాసులు చేసినట్లు సమాచారం.
అయితే, నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి పోలీసులు భార్గవ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక లక్ష నగదు, 5 నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, 2 నకిలీ ఐడీ కార్డులు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భార్గవ్పై ఇప్పటికే లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఉద్యోగ అవకాశాలను పరిశీలించకుండా డబ్బులు చెల్లించరాదని పోలీసు అధికారులు సూచించారు. జాబ్ ఆఫర్ల పేరుతో డబ్బులు అడిగిన వారిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
తాజావార్తలు
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!