Mahua Moitra: లోక్సభ ఎంపీగా బహిష్కరణ.. సుప్రీంను ఆశ్రయించిన మహువా మోయిత్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.
Read Also: Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీ నివేదికపై ఓటింగ్ నిర్వహించగా, దానిని మూజువాణి ఓటుతో ఆమోదించారు. లోక్సభ నుంచి తనను బహిష్కరించిన తర్వాత.. ఎథిక్స్ కమిటీ తన నివేదికలోని ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని మహువా మోయిత్రా అన్నారు. ఇది బీజేపీ అంతానికి నాంది అని విమర్శించారు. ఈ క్రమంలో.. లోక్సభ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. మహువా మోయిత్రా హైకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే ఆమె ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటులో ఆమోదించిన చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు. మహువా నిర్దోషి అని తేలితే, ఆమె ఎంపీ హోదాను పునరుద్ధరించవచ్చు. దోషిగా తేలితే, ఎంపీని తిరిగి నియమించే అవకాశాలు ఉండవు.
Read Also: Narendra Modi: ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పు.. మోడీ స్పందన
కాగా.. లంచం తీసుకుంటూ పార్లమెంట్లో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై మహువా మోయిత్రా దోషిగా తేలింది. బీజేపీ ఎంపీ వినోద్కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న జరిగిన సమావేశంలో డబ్బులు తీసుకుని, సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై లోక్సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలని సిఫార్సు చేసిన నివేదికను ఆమోదించింది.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!