మధ్యప్రదేశ్లో ఓ విద్యార్థుల గుంపు రెచ్చిపోయింది. ఏకంగా కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి గణిత ఉపాధ్యాయుడ్ని బెదిరింపులకు దిగారు. టీచర్ కూడా వారిని ధీటుగానే ఎదుర్కొన్నాడు. ప్రతిదాడిలో టీచర్కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
'క్యాష్ ఫర్ క్వైరీ' కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.