NEET-UG 2024: నీట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా..!
- నీట్ రీ- టెస్ట్ ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ..
- నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-UG 2024: వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు జరగడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని క్యాన్సిల్ చేసి జూన్ 23వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించారు. వారి ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ రిలీజ్ చేసింది. దీంతో పాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు పేర్కొనింది.
Read Also: Kalki 2898 AD: విదేశాల్లో కూడా రికార్డులు తిరగరాస్తున్న “కల్కి 2898 ఏడీ”
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
కాగా, మొత్తం 1,563 మందికి ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా.. దానికి కేవలం 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఆ రీ-ఎగ్జామ్ ఫలితాలను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని నీట్ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. ఈ ఫలితాల తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్టీఏ చెప్పుకొచ్చింది. సవరించిన స్కోర్ కార్డులను https://exams.nta.ac.in/NEET/లో చూసుకోవచ్చు అని తెలిపింది. త్వరలోనే నీట్ కౌన్సెలింగ్ జరగే అవకాశం ఉంది.
Read Also: Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్’ బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ హీరో!
అయితే, నీట్-యూజీ 2024 పరీక్షా ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొందరు అభ్యర్థులు, పలు సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేలరేగాయి. పరీక్ష రోజున కొన్ని కేంద్రాల్లో సమయం కోల్పోయిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలపడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా.. గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థులకు మళ్లీ ఎక్జామ్ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలాఉండగా.. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీపై దర్యాప్తు కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!