నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేసింది అధిష్టానం. వైసిపి బహిష్కృత ఎమ్మెల్యేలకు నెల్లూరు నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి, ఆనం, మేకపాటిలకు ఓటమి తప్పదు..వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే.. నా రాజకీయాల నుంచి తప్పుకుంటా.నేను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా.. 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందాం.
Read Also: Ravi Kishan: ఆమె నన్ను రాత్రికి రమ్మంది.. అల్లు అర్జున్ విలన్ షాకింగ్ కామెంట్స్
ఈసారి అనిల్ ను శాసనసభకు రానీయమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారు..ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు..పది స్థానాలు కాదు.. వెళ్లిన ముగ్గురూ ముందు గెలవండి..వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.. గెలుస్తా.. నన్ను ఆపండి.. చూద్దాం. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ల డం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదు.. కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారు..వచ్చే ఎన్నికల్లోను జగన్ కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు అనిల్ కుమార్ యాదవ్.
Read Also: Watching TV : టీవీ చూస్తూ అవి తింటున్నారా.. మీకు నెక్ట్స్ ఎపిసోడ్ ఉండదు