MP Uttam Kumar Reddy : ఈసారి 50వేల ఓట్లకు ఒక్కటి తక్కువచ్చినా.. రాజకీయాలకు గుడ్ బై చెప్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నియోజికవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో 50వేల ఓట్లకు ఒక్క ఓటు తక్కువచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించబోతోంది.. సెప్టెంబర్ లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది.. నవంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకు ఎన్నికలకు సమాయత్తం కావాలి అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతీ బూత్ లెవల్లో 10మంది సభ్యులతో కలిసి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి.. ప్రతీ 100 ఓట్లకు కలిపి ఒక సమన్వయకర్తను నియమించుకోవాలి… ఆ బాధ్యత నేను కూడా తీసుకుంటాను అని ఆయన అన్నారు.
Also Read : IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..?
Also Read
- స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
- Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
- Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
బాధ్యతతో పనిచేసే సమన్వయకర్తలకు నేను మొదటి ప్రాధాన్యతనిస్తాను అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాను ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఉపయోగించుకోవాలి.. ప్రతీ బూత్ కు ఒక వాట్సప్ గ్రూప్ ఉండాలి అంటూ పేర్కొన్నారు. ఎన్నికలంటే కేవలం మద్యం, డబ్బే కాదు.. కేవలం వాటిని పంచడానికే ఇళ్ళకి వెళ్తున్నారు.. వారు బాగోగులు కూడా చూసుకోవాలి.. ఈ 150రోజులు నేను, పద్మావతి మీ మధ్యనే ఉంటాం అని ఉత్తమ్ అన్నారు. సాండ్, లాండ్, వైన్స్, మైన్స్, దోపిడీలో బీఆర్ఎస్ నాయకులు ముందుంటారు అని ఆయన వెల్లడించారు. నేను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా చేసినా.. అయినా ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదంటూ అన్నాడు. హుజూర్ నగర నియోజికవర్గంలో అన్ని గ్రామాలకు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించాను అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read : సాగర తీరాన సారా అలీ ఖాన్ అందాల ఆరబోత
తాజావార్తలు
-
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
-
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
-
Psychology Facts: పొసెసివ్నెస్.. రిలేషన్షిప్ను నాశనం చేస్తుందా?
-
CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
-
BMW X1 LWB: భారత్లో BMW X1 LWB విడుదల.. మొదటిసారి లగ్జరీ కారు కొనేవారిపై BMW కన్ను
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?