EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO EDLI Scheme: ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక భద్రతా ప్రయోజనాలను అందిస్తోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, PF ఖాతా ఉన్న ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీని పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం ద్వారా లభిస్తుంది.
EPFO 1976లో ప్రారంభించిన EDLI పథకం, ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకంలో సభ్యులైన ఉద్యోగులు ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. బీమా ప్రీమియాన్ని పూర్తిగా యజమాని సంస్థే భరిస్తుంది. ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Salary) మరియు డీఏ (Dearness Allowance) మొత్తంలో 0.50 శాతం ప్రీమియంగా సంస్థ చెల్లిస్తుంది.
Also Read
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ఈ పథకం ప్రకారం, EPFO సభ్యుడు ఉద్యోగంలో ఉన్న సమయంలో అకాల మరణం చెందితే, అతని లేదా ఆమె నామినీకి కనీసం రూ.2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందజేస్తారు. దీంతో కుటుంబ సభ్యులకు అత్యవసర సమయంలో ఆర్థికంగా కొంత భరోసా లభిస్తుంది. EDLI ప్రయోజనం పొందాలంటే ఉద్యోగి మరణానికి ముందు కనీసం 12 నెలల పాటు ఉద్యోగంలో కొనసాగి ఉండాలి. ఈ కాలంలో ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినా, PF ఖాతా యాక్టివ్గా ఉంటే ఈ బీమా ప్రయోజనానికి అర్హత కొనసాగుతుంది. అయితే ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణించిన సందర్భంలో మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.
ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఫారం 5IFను సంబంధిత PF కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి. అవసరమైన పత్రాల పరిశీలన అనంతరం బీమా మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుంది. EPFO సభ్యులు తప్పనిసరిగా తమ UAN పోర్టల్లో ఇ-నామినేషన్ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా భవిష్యత్తులో కుటుంబ సభ్యులు క్లెయిమ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా PF ఖాతా కేవలం పదవీ విరమణ నిధి మాత్రమే కాదని, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే ఉచిత బీమా కవచంగా కూడా పనిచేస్తుందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!