EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO EDLI Scheme: ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక భద్రతా ప్రయోజనాలను అందిస్తోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, PF ఖాతా ఉన్న ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీని పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం ద్వారా లభిస్తుంది.
EPFO 1976లో ప్రారంభించిన EDLI పథకం, ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకంలో సభ్యులైన ఉద్యోగులు ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. బీమా ప్రీమియాన్ని పూర్తిగా యజమాని సంస్థే భరిస్తుంది. ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Salary) మరియు డీఏ (Dearness Allowance) మొత్తంలో 0.50 శాతం ప్రీమియంగా సంస్థ చెల్లిస్తుంది.
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ఈ పథకం ప్రకారం, EPFO సభ్యుడు ఉద్యోగంలో ఉన్న సమయంలో అకాల మరణం చెందితే, అతని లేదా ఆమె నామినీకి కనీసం రూ.2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందజేస్తారు. దీంతో కుటుంబ సభ్యులకు అత్యవసర సమయంలో ఆర్థికంగా కొంత భరోసా లభిస్తుంది. EDLI ప్రయోజనం పొందాలంటే ఉద్యోగి మరణానికి ముందు కనీసం 12 నెలల పాటు ఉద్యోగంలో కొనసాగి ఉండాలి. ఈ కాలంలో ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినా, PF ఖాతా యాక్టివ్గా ఉంటే ఈ బీమా ప్రయోజనానికి అర్హత కొనసాగుతుంది. అయితే ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణించిన సందర్భంలో మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.
ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఫారం 5IFను సంబంధిత PF కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి. అవసరమైన పత్రాల పరిశీలన అనంతరం బీమా మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుంది. EPFO సభ్యులు తప్పనిసరిగా తమ UAN పోర్టల్లో ఇ-నామినేషన్ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా భవిష్యత్తులో కుటుంబ సభ్యులు క్లెయిమ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా PF ఖాతా కేవలం పదవీ విరమణ నిధి మాత్రమే కాదని, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే ఉచిత బీమా కవచంగా కూడా పనిచేస్తుందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!