Eluru Tragedy: ఏలూరు జిల్లాలో విషాదం.. జీడి మామిడి తోటలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి!
- ఏలూరు జిల్లాలో విషాదం
- తల్లి, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి
- కొంత కుళ్లిన స్థితిలో మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం నల్లమడు సమీపంలోని జీడి మామిడి తోటల్లో తల్లి, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. మృతులను అనంతపల్లి కొత్తపేటకు చెందిన వడ్డే వెంకటలక్ష్మి, ఆమె కుమార్తె వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరలక్ష్మి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె దివ్యాంగురాలు కావడంతో.. తల్లి వెంకటలక్ష్మి సహాయంతో రోజువారీ విధులు నిర్వహించేవారు. తల్లి, కూతురు ఇద్దరూ శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి నుంచి వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో నల్లమడు సమీపంలోని జీడి మామిడి తోటలో ఇద్దరి మృతదేహాలు గుర్తించబడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు కొంత కుళ్లిన స్థితిలో ఉండటంతో వారు మరణించి కొన్ని రోజులు గడిచినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. తల్లి, కూతురిని ఎక్కడైనా హత్య చేసి అనంతరం తోటలో పడేశారా? లేదా అదే ప్రాంతంలో హత్య జరిగిందా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!