Srisailam: శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ జెన్కో.. అయితే, దిగువన్న ఉన్న నాగార్జున సాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరారు సాగర్ అధికారులు.. దీంతో.. 3 టీఎంసీల వరకు నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. సాగర్ కి విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా.. శ్రీశైలం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు..
Read Also: Mayor Sunil Rao: బండి సంజయ్ ను కలిస్తే తప్పేముంది.. మంత్రి పొన్నం పై మేయర్ ఫైర్..
అయితే.. శ్రీశైలం డ్యామ్కు ఇన్ ఫ్లో నిల్గా ఉంది.. విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో.. ఔట్ ఫ్లో 15,919 క్యూసెక్కులుగా ఉంది.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 812.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 35.9850 టీఎంసీల నీటి నిల్వ ఉంది.. అయితే, జులై 15వ తేదీ దాటినా.. చెప్పుకో దగిన స్థాయిలో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు నీరు చేరడం లేదు.. దీంతో.. శ్రీశైలం ఎప్పుడు నిండుతుందా.. నాగార్జున సాగర్కు నీరు చేరేది ఎప్పుడు.. ఇలా దిగువ ప్రాజెక్టుల్లో నీటి కోసం.. రైతులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. మరింతస్థాయిలో నీటిమట్టం చేరితో.. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంతో పాటు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం అవుతున్నారు అధికారులు..