CEC : ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్.. ఓటర్లకు స్టాండింగ్ అవేషన్ ఇచ్చిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CEC Rajiv Kumar: రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఏడు విడుతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో రికార్డులు సృష్టించారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఈసారి మహిళలు కూడా అధిక సంఖ్యలో ఓటు వేసినట్లు సీఈసీ తెలిపింది. ఈ సారి ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 31 కోట్ల 20 లక్షల మంది మహిళలు సహా 64 కోట్ల 20 లక్షల మంది ఓటర్లు పాల్గొని భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని సీఈసీ పేర్కొంది. ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్టాండింగ్ అవేషన్ ఇచ్చింది. మనదేశం ఓటేసిన వారి సంఖ్య.. జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. రూ.10 వేల కోట్ల నగదును సీజ్ చేశామన్నారు.
Read Also: DGP Harish Kumar Gupta: సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు.. డీజీపీ సీరియస్ వార్నింగ్
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఎన్నికల సిబ్బంది అద్భుతంగా పని చేయడం వల్ల ఈసారి తక్కువ రీపోలింగ్ జరిగిందని సీఈసీ పేర్కొంది. మేము 2024 లోక్సభ ఎన్నికలలో 39 రీపోల్స్ మాత్రమే చూశామని, అయితే 2019 లో 540 రీపోల్స్ వచ్చాయని సీఈసీ పేర్కొన్నారు. 39 రీపోలింగ్ లలో 25 రీపోల్స్ కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే జరిగాయన్నారు. లోక్సభ ఎన్నికలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. హింసను చూడని సార్వత్రిక ఎన్నికలలో ఇదొకటి అని అన్నారు. దీనికి రెండేళ్ల సన్నద్ధత అవసరమన్నారు. కౌంటింగ్కు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు సీఈసీ తెలిపింది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?