Site icon NTV Telugu

Breaking News : కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు ఈసీ నిషేధం

Kcr

Kcr

తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. అయితే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్‌ అయిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే.. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ.. నా మాట‌ల‌ను అధికారులు స‌రిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండ‌లికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేత‌లు కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్య‌ల‌కు ఇంగ్లీష్ అనువాదం స‌రికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమ‌ల్లో వైఫ‌ల్యాన్నే ప్ర‌స్తావించాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

Exit mobile version