Repolling: మధురాపూర్, బరాసత్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Repolling: పశ్చిమ బెంగాల్లోని బరాసత్, మథురాపూర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు సోమవారం ఒక్కో పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో జూన్ 1న ఓటింగ్ నిర్వహించగా.. అ ఫిర్యాదులు రావడంతో మళ్లీ ఇక్కడ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 120-దేగంగా అసెంబ్లీ నియోజకవర్గంలోని 61 కదంబగచ్చి సరదార్ పద ఎఫ్పీ స్కూల్లోని రూమ్ నంబర్ 2.. మధురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కాక్ద్వీప అసెంబ్లీలో గల ఆదిర్ మహల్ శ్రీచైతన్య బిద్యాపీఠ్ ఎఫ్పీ స్కూల్లో రీపోలింగ్ నిర్వహించబడుతుంది. బరాసత్, మథురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత రీపోలింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2024 లోక్సభ ఎన్నికలకు జూన్ 1న జరిగిన ఓటింగ్కు సంబంధించి ఒక నివేదిక అందింది. అన్ని భౌతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Read Also: Thief Falls Asleep: దొంగతనానికి వెళ్లి నిద్రలోకి జారుకున్న దొంగ.. కట్ చేస్తే!
Also Read
ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు రాసిన లేఖలో.. ‘జూన్ 1న లోక్సభ ఎన్నికల చివరి దశ సందర్భంగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్), భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లోని బసిర్హట్లోని బైర్బరీలో శనివారం లోక్సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని మేరాగంజ్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. బసిర్హట్లోని సందేశ్ఖాలీలో శనివారం జరిగిన హింసకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు వెళ్లినప్పుడు, స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!