Repolling: మధురాపూర్, బరాసత్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు
Repolling: పశ్చిమ బెంగాల్లోని బరాసత్, మథురాపూర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు సోమవారం ఒక్కో పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో జూన్ 1న ఓటింగ్ నిర్వహించగా.. అ ఫిర్యాదులు రావడంతో మళ్లీ ఇక్కడ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 120-దేగంగా అసెంబ్లీ నియోజకవర్గంలోని 61 కదంబగచ్చి సరదార్ పద ఎఫ్పీ స్కూల్లోని రూమ్ నంబర్ 2.. మధురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కాక్ద్వీప అసెంబ్లీలో గల ఆదిర్ మహల్ శ్రీచైతన్య బిద్యాపీఠ్ ఎఫ్పీ స్కూల్లో రీపోలింగ్ నిర్వహించబడుతుంది. బరాసత్, మథురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత రీపోలింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2024 లోక్సభ ఎన్నికలకు జూన్ 1న జరిగిన ఓటింగ్కు సంబంధించి ఒక నివేదిక అందింది. అన్ని భౌతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Read Also: Thief Falls Asleep: దొంగతనానికి వెళ్లి నిద్రలోకి జారుకున్న దొంగ.. కట్ చేస్తే!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు రాసిన లేఖలో.. ‘జూన్ 1న లోక్సభ ఎన్నికల చివరి దశ సందర్భంగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్), భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లోని బసిర్హట్లోని బైర్బరీలో శనివారం లోక్సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని మేరాగంజ్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. బసిర్హట్లోని సందేశ్ఖాలీలో శనివారం జరిగిన హింసకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు వెళ్లినప్పుడు, స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!