హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టారు. ఈ సందర్భంగా ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఎఫ్ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. మనీలాండరింగ్ కోణంలోను శివ బాలకృష్ణను ఈడీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. మరోవైపు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బినామీ ఆస్తులపై కూడా ఐటీ అధికారులు విచారణ చేయనున్నారు.
Read Also: YCP Rebel MLAs: నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ.. భవిష్యత్పై క్లారిటీ..!
ఇక, అధికారాన్ని అపయోగించుకుని హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ సుమారు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం 250 కోట్ల రూపాయల ఆస్తులను బాలకృష్ణ కుడబెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ నాలుగు రెట్లు ఉండే ఛాన్స్ ఉంది. ఈ కేసులో శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.