EAP CET : విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఎప్ సెట్
- రేపటి నుంచి EAPCET 2025 పరీక్షలు
- ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల కోసం 3,06,796 మంది దరఖాస్తు
- కఠినమైన పరీక్షా నిబంధనలు.. ఆలస్యంగా వచ్చే వారికి నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EAP CET : తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ , అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (EAPCET) పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షకు ఈ సంవత్సరం మొత్తం 3,06,796 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 29 , 30 తేదీల్లో అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్లకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత, మే 2వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రోజూ రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. ఈసారి ఇంజినీరింగ్ స్ట్రీమ్కు 2,20,049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్లకు 86,493 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య కాస్త తగ్గింది.
పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సంవత్సరం తొలిసారిగా ఎప్సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ను సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడరు అనే నిబంధన కఠినంగా అమలు చేయబడుతుంది. ఉదయం సెషన్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుండి, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు మధ్యాహ్నం 1:30 గంటల నుండి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. విద్యార్థులు చేతులపై మెహందీ, టాటూలు లేదా ఇంక్ వంటి డిజైన్లు లేకుండా చూసుకోవాలి. పరీక్షకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ , బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తీసుకురావాలి.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!