EAP CET : విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఎప్ సెట్
- రేపటి నుంచి EAPCET 2025 పరీక్షలు
- ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల కోసం 3,06,796 మంది దరఖాస్తు
- కఠినమైన పరీక్షా నిబంధనలు.. ఆలస్యంగా వచ్చే వారికి నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EAP CET : తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ , అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (EAPCET) పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షకు ఈ సంవత్సరం మొత్తం 3,06,796 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 29 , 30 తేదీల్లో అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్లకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత, మే 2వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రోజూ రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. ఈసారి ఇంజినీరింగ్ స్ట్రీమ్కు 2,20,049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్లకు 86,493 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య కాస్త తగ్గింది.
పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సంవత్సరం తొలిసారిగా ఎప్సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ను సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడరు అనే నిబంధన కఠినంగా అమలు చేయబడుతుంది. ఉదయం సెషన్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుండి, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు మధ్యాహ్నం 1:30 గంటల నుండి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. విద్యార్థులు చేతులపై మెహందీ, టాటూలు లేదా ఇంక్ వంటి డిజైన్లు లేకుండా చూసుకోవాలి. పరీక్షకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ , బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తీసుకురావాలి.
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
తాజావార్తలు
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!