Hyderabad: హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో వివిధ బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్.ఆర్ బ్లడ్ బ్యాంక్లో సోదాలు చేపట్టారు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను గుర్తించారు. దీంతో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్లో తనిఖీలు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్లోనూ డ్రగ్ అధికారుల సోదాలు చేపట్టారు. భారీగా అక్రమ నిల్వలు, అపరిశుభ్రమైన హ్యూమన్ బ్లడ్, ప్లాస్మా యూనిట్స్ పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Also: Bjp: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మాకొట్టడంపై బీజేపీ విమర్శ
Also Read
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
మరోవైపు.. మూసాపేటలో రక్తంలోని ప్లాస్మా అక్రమంగా విక్రయిస్తున్న హేమో సర్వీస్ లాబొరేటరీస్ అనే సంస్థ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు. కాగా.. అక్రమంగా రక్తం, ప్లాస్మా, సీరం విక్రయిస్తున్న ఆర్.రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ 2016లో మూసాపేట భవాని నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్రమంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి పలు బ్లడ్ బ్యాంకుల నుండి 700 నుండి 1000 రూపాయలకు రక్తము సేకరించి, వాటి నుండి రక్తము, ప్లాస్మా, సీరం వేరు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ బ్లడ్ బ్యాంక్ పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ రోజు దాడి చేశారు. బ్లడ్ బ్యాంకుకు అనుమతులు లేకపోవటమే కాకుండా నిట్ నేస్ లేని పరిసరాల్లో రక్తాన్ని వేరు చేసిన ప్లాస్మా బ్యాగులు, రక్తం బ్యాగులు, ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచిన రక్తం, సీరం, ప్లాస్మాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Harish Rao: ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తాగు, సాగునీటి కష్టాలు తప్పవు..
తాజావార్తలు
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!