Hyderabad: హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో వివిధ బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్.ఆర్ బ్లడ్ బ్యాంక్లో సోదాలు చేపట్టారు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను గుర్తించారు. దీంతో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్లో తనిఖీలు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్లోనూ డ్రగ్ అధికారుల సోదాలు చేపట్టారు. భారీగా అక్రమ నిల్వలు, అపరిశుభ్రమైన హ్యూమన్ బ్లడ్, ప్లాస్మా యూనిట్స్ పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Also: Bjp: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మాకొట్టడంపై బీజేపీ విమర్శ
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
మరోవైపు.. మూసాపేటలో రక్తంలోని ప్లాస్మా అక్రమంగా విక్రయిస్తున్న హేమో సర్వీస్ లాబొరేటరీస్ అనే సంస్థ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు. కాగా.. అక్రమంగా రక్తం, ప్లాస్మా, సీరం విక్రయిస్తున్న ఆర్.రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ 2016లో మూసాపేట భవాని నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్రమంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి పలు బ్లడ్ బ్యాంకుల నుండి 700 నుండి 1000 రూపాయలకు రక్తము సేకరించి, వాటి నుండి రక్తము, ప్లాస్మా, సీరం వేరు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ బ్లడ్ బ్యాంక్ పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ రోజు దాడి చేశారు. బ్లడ్ బ్యాంకుకు అనుమతులు లేకపోవటమే కాకుండా నిట్ నేస్ లేని పరిసరాల్లో రక్తాన్ని వేరు చేసిన ప్లాస్మా బ్యాగులు, రక్తం బ్యాగులు, ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచిన రక్తం, సీరం, ప్లాస్మాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Harish Rao: ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తాగు, సాగునీటి కష్టాలు తప్పవు..
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!