NTV Telugu Site icon

Drone Show: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో డ్రోన్‌ షో

Drone Show

Drone Show

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూన్​ 3న రైతు దినోత్సవం ఘనంగా జరుపుకున్న ప్రజానికం.. జూన్​ 4న సురక్షా దినోత్సవం జరుపుకున్నారు. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర లేజర్, త్రీడీ షోను ప్రదర్శించారు.

Also Read : OPEC Plus: సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్‎కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే

ఆ లేజర్ ​షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ.. వాటి విజువల్స్ ను ప్రదర్శించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను చూపిస్తూ.. ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్​ విగ్రహం, తెలంగాణ సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు, వేములవాడ మల్లన్న స్వామి, సీఎం కేసీఆర్, టీహబ్, పోలీసుల లోగో, మిషన్​ భగీరథ, డబుల్ బెడ్​రూం, సైబరాబాద్ పోలీస్ ​లోగో, షీ టీమ్స్ లోగో.. ఆఖరికి జై తెలంగాణ జై భారత్​అనే నినాదంతో ఈ లేజర్ షో ​ముగిసింది. ఈ లేజర్ ​షోను చూసేందుకు వచ్చిన ప్రజలు.. ఆ షోను చూసి ఆనందం, కరతాల ధ్వనులతో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు.

Also Read : Andhrapradesh: నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ