DPL 2025 Auction: డీపీఎల్ వేలంలో కోహ్లీ, సెహ్వాగ్ కుమారులు.. ఎంత పలికారో తెలుసా?
- డీపీఎల్ 2025 వేలంలో కోహ్లీ, సెహ్వాగ్ కుమారులు
- సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్కు 8 లక్షలు
- కోహ్లీ అన్న కుమారుడు ఆర్యవీర్ ఆర్యవీర్కు 1 లక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aryaveer Kohli and Aryaveer Sehwag Attract Bids in DPL 2025 Auctionఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 వేలంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ పాల్గొన్నాడు. ఆర్యవీర్ కోహ్లీని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ రూ.1 లక్షకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు కైవసం చేసుకుంది. వికాస్, సెహ్వాగ్ కుమారులు డీపీఎల్ 2025 వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరి పేరు ఆర్యవీర్ కావడం ఇక్కడ విశేషం.
వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ ఢిల్లీ అండర్ 19-క్రికెట్ జట్టులో భాగం. ఇటీవల ఢిల్లీ అండర్-19కి ప్రాతినిధ్యం వహించి మేఘాలయపై 297 రన్స్ చేశాడు. 18 ఏళ్ల ఆర్యవీర్ కూడా తండ్రి లాగే ఓపెనర్. భారీ ధర పలికిన ఆర్యవీర్ ఎలా ఆడుతాడో చూడాలి. ఇక వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ లెగ్ స్పిన్నర్. ఆర్యవీర్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ఆయుష్ బదోని నాయకత్వంలో ఆర్యవీర్ కోహ్లీ ఆడనున్నాడు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
డీపీఎల్ 2025 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేసర్ సిమర్జీత్ సింగ్ నిలిచాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ ఫాస్ట్ బౌలర్ను రూ.39 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025లో సిమర్జీత్ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున ఆడాడు. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ రెండవ అత్యధిక బిడ్ అందుకున్నాడు. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ రూ.38 లక్షలకు కొనుగోలు చేసింది. 2024 ఎడిషన్ సెమీ-ఫైనలిస్ట్ పురానీ ఢిల్లీ 6 టీమ్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ను అట్టిపెట్టుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వేలానికి ముందు మార్క్యూ ప్లేయర్గా నిలుపుకుంది.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!