Fraud: డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!!
- ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు.. నకిలీ పట్టాలతో మోసం
- 100 మందిని మోసగించిన కోటి రూపాయల స్వాహా
- డబుల్ బెడ్రూమ్ కలతో బంధువులకే మోసం చేసిన కేటుగాళ్లు
డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!! ఈ ఆఫర్ మీకు కూడా టెంప్టింగ్గా అనిపిస్తోంది కదూ..!! అవును మరి అలాంటిదే బంపర్ ఆఫర్..!! ఇలా నమ్మించే దాదాపు 100 మందిని బురిడీ కొట్టించారు నలుగురు కేటుగాళ్లు. ఏకంగా కోటి రూపాయలు కొట్టేసి నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు.
సొంత ఇల్లు ఎవరికైనా ఓ కల. సొంత ఇల్లు ఉండాలి.. ఇది ఎవరికైనా ఓ కల..డబుల్ బెడ్రూమ్ వస్తుందంటే ఎగిరి గంతేస్తారు. ఇక సర్కారు నుంచి డబుల్ బెడ్రూమ్ వస్తుందంటే ఎగిరి గంతేస్తారు… ఏకంగా పట్టా చేతిలో పెడతామంటే సంతోషమే వేరు.
అది కూడా జస్ట్ చిన్న మొత్తం కడితే.. ఏకంగా పట్టా చేతిలో పెడతామంటే.. ఆ సంతోషానికి అవధులు ఉండవు.. ఇలా గ్యాస్ కొట్టే ఒకడు హైదరాబాద్లో దాదాపు 100 మందిని మోసం చేశారు. అందులో సొంత బంధువులు కూడా ఉన్నారు.మున్సిపల్, రెవెన్యూ శాఖలో తెలిసిన వారు ఉన్నారని చెప్పి మోసం. బండ్లగూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మహమ్మద్ అహ్మద్, అంజాద్, కౌసర్ అలీ, రాజశేఖర్ జనాన్ని మోసం చేశారు. అతి తక్కువ ధరకే వాటిని ఇప్పిస్తామని చెప్పారు. పైగా మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న వారు ఉన్నారని.. తాము చెబితే అందరికీ డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ వస్తాయని నమ్మించారు. ఇందులో భాగంగానే కొన్ని పట్టాలని తీసుకుని వచ్చారు. ఇవి చూసి బంధుమిత్రులందరూ కూడా డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు వస్తాయని ఆశించారు…
Also Read
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగాయ్
రెవెన్యూ అధికారుల సంతకాల ఫోర్జరీ . మరోవైపు ఈ ముఠా.. జనాన్ని నమ్మించేందుకు ఒక యాప్ ద్వారా నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేశారు. అంతే కాదు తమను నమ్మి డబ్బులు కట్టిన 11 మందికి పట్టాలను అందజేశారు. ఇలా తక్కువ ధరకే ఇళ్లు వస్తున్నాయనే ఆశతో మరింత మంది తలా ఒక్కంటికి రూ. 2 లక్షల వరకు చెల్లించారు. ఇలా దాదాపు 100 మంది వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేశారు కేటుగాళ్లు. బండ్లగూడలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపించి ఇక్కడే నివాసం ఉండే విధంగా కేటాయింపులు జరిపిస్తామని చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి.. వారికి నకిలీ పట్టాలు కూడా ఇచ్చేశారు…. కానీ వన్ ఫైన్ మార్నింగ్.. రెండు పడక గదుల ఇళ్లు వచ్చాయని నమ్మిన వాళ్లు అక్కడికి వెళ్లి ఆరా తీయగా నకిలీ పట్టాలు సృష్టించి మోసం చేసినట్లు గ్రహించారు బాధితులు.
దీంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు విచారణ ప్రారంభించారు. బండ్లగూడ పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసు అధికారులు కలిసి జాయింట్ గా ఆపరేషన్ నిర్వహించారు. టాస్క్ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ పంపించారు… సొంతింటి కోసం కలలు కంటున్న వారు.. ఇలాంటి బ్రోకర్లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి వారినే కాదు.. చోటా మోటా రాజకీయ నాయకులను సైతం నమ్మొద్దని వార్నింగ్ ఇచ్చారు..
Rajasthan: ప్రియురాలి గొంతు కోసి చంపి పాతి పెట్టిన ప్రియుడు.. కట్చేస్తే…
తాజావార్తలు
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!