NTV Telugu Site icon

CMR Trolls: సిఎంఆర్ పై సోషల్ మీడియాలో ట్రోలవుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు: కంకటాల మల్లిక్

Press Not

Press Not

CMR Trolls: సిఎంఆర్ షాపింగ్ మాల్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న నకిలీ, మార్ఫింగ్ చేసిన పోస్టు దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామని., సిఎంఆర్ షాపింగ్ మాల్ గత 4 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుని వేడుక ఏదైనా సిఎంఆర్ తోనే శుభారంభం అనే నానుడితో ప్రతి ఇంటా చెరగని ముద్రవేసిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలి కాలంలో కొంతమంది పోటీదారులు సిఎంఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో కావాలనే బ్రాండ్ లోగోను ఒక సోషల్ మీడియా పోస్టులో మార్ఫింగ్ చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని, ప్రజలందరూ దీనిని గమనించాలని ఏదైనా ఫేక్ పోస్టు చేసినపుడు అది అవునా కాదా అని నిర్ధారణ చేసుకుని పోస్టులు చేయాలని.. దీనివలన ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న సంస్థలపై వ్యతిరేక భావం కలుగుతుందని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్.

ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టును తగినటువంటి ఆధారాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ పోలీసులు మా స్టోరు ఉన్న ప్రతి పోలీసు స్టేషన్లో పైన తెలిపిన పోస్టు దుష్ప్రచారానికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవలసినదిగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయటం జరిగినదని, కావున సిఎంఆర్ షాపింగ్ మాల్ పై ఇటువంటి దుష్ప్రచారాన్ని తెలిసీ తెలియక మరెవరికైనా పైన తెలిపిన పోస్టును ఫార్వార్డ్ చేస్తే సైబర్ క్రైమ్ చట్టరీత్యా తగు చర్యలు తీసుకొనబడునని సిఎంఆర్ ఫౌండర్ & చైర్మన్ శ్రీ మావూరి వెంకటరమణ ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో తెలిపారు.

సిఎంఆర్ అంటే ప్రజలలో ఒక నమ్మకం కలిగిన సంస్థ. సిఎంఆర్ తన వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే సంస్థ. దీనిపై ఇటువంటి తప్పుడు పోస్టులు ఎవరైనా పోస్ట్ చేసినపుడు ప్రజలందరూ దీనిని గమనించాలని.. ఏదైనా ఫేక్ పోస్టు చేసినపుడు., అది అవునా కాదా అని నిర్ధారణ చేసుకుని పోస్టులు చేయాలని దీనివలన ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న సంస్థలపై వ్యతిరేక భావం కలుగుతుందని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీకృష్ణ.

సిఎంఆర్ సంస్థల మీద సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతుంది, మతపరమైన అంశాల్ని జోడించి ఫేక్ పోస్టులతో ప్రచారం చేస్తున్నారు. అలాంటి పోస్టర్ని ఎప్పుడు సిఎంఆర్ కూడా ముద్రించలేదు. ఈ విషయాన్ని గమనించాలి. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదర్శన్ స్వామి అన్నారు. సిఎంఆర్ సంస్థల మీద సోషల్ మీడియా వేదికగా, దుష్ప్రచారం జరుగుతున్న విషయాలను గమనించి ఇటువంటి ఫేక్ పోస్టులను ఫార్వార్డ్ చేయవద్దని కోరుతున్నామన్నారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగినదని, దీనిపై విచారణ జరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ పూర్వపు ప్రెసిడెంట్ (స్టేట్) పైడా కృష్ణ ప్రసాద్ అన్నారు.