Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్ను వదిలేసి కుట్లేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Towel Inside Stomach: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన ఘటన యూపీలోని అమ్రోహాలో జరిగింది. అమ్రోహాలోని ఓ ఆస్పత్రిలో ప్రసవ వేదనతో గర్భిణీ చేరగా.. వైద్యుడు ఆపరేషన్ చేసి టవల్ను కడుపులో మర్చిపోయాడు. ఈ కేసుపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ సమగ్ర విచారణక ఆదేశించారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమ్రోహాలోని నౌగావానా సాదత్ పీఎస్ పరిధిలో డాక్టర్ మత్లూబ్ అనుమతి లేకుండా సైఫీ నర్సింగ్ హోమ్ను నడుపుతున్నాడు. ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు ఆయన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం కడుపులో టవల్ను పెట్టి అలాగే కుట్లు వేశాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా టవల్ కడుపులో ఉండిపోయింది. ఆ మహిళ కడుపు నొప్పి అని చెప్పడంతో ఆ వైద్యుడు ఆమెను ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని చెప్పాడు. బయట చలి కారణంగా ఆమె ఈ కడుపు నొప్పిని ఎదుర్కొంటుందని పేర్కొన్నాడు.
Also Read
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
Hyderabad Crime: బైక్ నంబర్ ప్లేట్కు ఫేస్ మాస్క్.. కానీ మూల్యం చెల్లించక తప్పలేదు..
ఐదు రోజుల తర్వాత వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినా ఆరోగ్యం బాగోకపోవడంతో ఆ మహిళ భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రోహాలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కడుపునొప్పి వెనుక అసలు నిజం బయటపడింది. కడుపులో టవల్ ఉందని తెలుసుకుని వైద్యులు మరో ఆపరేషన్ చేసి టవల్ తీసేశారు. ప్రైవేట్ డాక్టర్ మత్లూబ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ షంషేర్ అలీ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి తనకు మీడియా నివేదికల ద్వారా తెలిసిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ వెల్లడించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని నోడల్ అధికారి డాక్టర్ శరద్ను కోరానన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలను చెప్పగలమని సీఎంవో సింఘాల్ మంగళవారం తెలిపారు. అయితే, షంషేర్ అలీ ఈ వ్యవహారంపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని, విచారణ జరుగుతుందని సీఎంవో హామీ ఇచ్చారు. సీఎంవో విచారణ నివేదిక రాగానే పోలీసులు విచారణ ప్రారంభిస్తారని పేర్కొనడం గమనార్హం.
తాజావార్తలు
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!