Gandhi Jayanti: భారతదేశంలో పర్యటించాలని గాంధీకి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Jayanti: మారిన మనిషి మహాత్ముడు అవుతాడు అని నిరూపించిన వ్యక్తి గాంధీజీ. 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ లోని పోర్బందర్లో జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్మా గాంధీగా ఎలా మారారు..? అయన ఎవరి సూచన పైన భారత దేశం మొత్తం పర్యటించారు..? అయన స్వాతంత్రం కోసం ఎలాంటి ఉద్యమాలని చేపట్టారు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:CM Jagan: మహాత్మా గాంధీ గారి మార్గంలోనే నడుస్తున్నాం..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
గుజరాత్ లోని పోర్బందర్లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గాంధీజికి 13 సంవత్సరాల వయసులో కస్తూర్బా అనే యువతితో వివాహం జరిగింది. ఈయన1893లో లా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లారు. దాదాపు 22 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఒకసారి గాంధీజీ రైలులో ఫస్ట్-క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తుండగా బ్రిటీష్ వాళ్ళు గాంధీజిని రైలు లోనుండి తోసేశారు. టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్న గాంధీని కేవలం నల్లజాతి వాడని వాళ్ళు అలా రైలు నుండి తోసేశారు. ఈ ఘటన గాంధీని కలిచివేసింది. దీనితో జాతి వివక్షతను నిర్మూలించాలని సంకల్పించుకున్నారు. అనంతరం గాంధీజి 1915లో భారత దేశానికి వచ్చారు. ప్రజలు స్వదేశంలో బానిసలుగా ఉండడాన్ని చూసి చలించిపోయారు. ఎలాగైన భరత మాత బానిస సంకెళ్లను తెంచెయ్యాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ గోఖలేని కలిసిన గాంధీజీ తన అభిష్టాన్నీ తెలిపారు.
Read also:UP Police: యూపీలో దారుణం.. వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుళ్లు!
కాగా దేశంకోసం ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఒకసారి దేశంలో స్థితిగతుల గురించి తెలుసుకోవాలని.. అందుకోసం కనీసం ఒక సంవత్సరమైనా దేశంలో పర్యటించి దేశంలో ఏం జరుగుతుందో పరిశీలించాలని.. అప్పుడే ఏం చెయ్యాలో అర్ధమౌతుందని గోపాలకృష్ణ గోఖలే సలహా ఇచ్చారు. గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే సలహానుసారం ముంబై నుండి తన పర్యటన ప్రారంభించి దేశం మొతం పర్యటించారు. పర్యటన అనంతరం 1917లో బీహార్లోని చంపారన్ జిల్లా నుంచి గాంధీజీ తొలి ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమమే సత్యాగ్రహం. అనంతరం గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంతో సహా వివిధ స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయి. గాంధీజీ ఆధ్వర్యంలో భారతదేశంలో వలస పాలనకు వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. దేశంలో అంటరానితనం నిర్మూలనకు కూడా ఎనలేని కృషి చేశారు గాంధీజీ. అంటరాని తనాన్ని రూపుమాపేందుకు వాళ్ళను హరిజనులు అనిపిలవడం ప్రారంభించారు. హరిజనులు అంటే దేవుని పిల్లలు అని అయన తెలియచేసారు. భారతదేశంలో చేనేత పరిశ్రమను పునరుద్ధరించడానికి మహాత్మా గాంధీ కూడా కృషిచేశారు, ముఖ్యంగా ఖాదీపై దృష్టి పెట్టారు. అహింసను ఆయుధంగా మలుచుకుని స్వాతంత్రాన్ని సంపాదించిన గాంధీజీ పుట్టినరోజును “అంతర్జాతీయ అహింసా దినోత్సవం”గా జరుపుకుంటారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!