Gandhi Jayanti: భారతదేశంలో పర్యటించాలని గాంధీకి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Jayanti: మారిన మనిషి మహాత్ముడు అవుతాడు అని నిరూపించిన వ్యక్తి గాంధీజీ. 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ లోని పోర్బందర్లో జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్మా గాంధీగా ఎలా మారారు..? అయన ఎవరి సూచన పైన భారత దేశం మొత్తం పర్యటించారు..? అయన స్వాతంత్రం కోసం ఎలాంటి ఉద్యమాలని చేపట్టారు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:CM Jagan: మహాత్మా గాంధీ గారి మార్గంలోనే నడుస్తున్నాం..
Also Read
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
గుజరాత్ లోని పోర్బందర్లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గాంధీజికి 13 సంవత్సరాల వయసులో కస్తూర్బా అనే యువతితో వివాహం జరిగింది. ఈయన1893లో లా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లారు. దాదాపు 22 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఒకసారి గాంధీజీ రైలులో ఫస్ట్-క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తుండగా బ్రిటీష్ వాళ్ళు గాంధీజిని రైలు లోనుండి తోసేశారు. టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్న గాంధీని కేవలం నల్లజాతి వాడని వాళ్ళు అలా రైలు నుండి తోసేశారు. ఈ ఘటన గాంధీని కలిచివేసింది. దీనితో జాతి వివక్షతను నిర్మూలించాలని సంకల్పించుకున్నారు. అనంతరం గాంధీజి 1915లో భారత దేశానికి వచ్చారు. ప్రజలు స్వదేశంలో బానిసలుగా ఉండడాన్ని చూసి చలించిపోయారు. ఎలాగైన భరత మాత బానిస సంకెళ్లను తెంచెయ్యాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ గోఖలేని కలిసిన గాంధీజీ తన అభిష్టాన్నీ తెలిపారు.
Read also:UP Police: యూపీలో దారుణం.. వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుళ్లు!
కాగా దేశంకోసం ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఒకసారి దేశంలో స్థితిగతుల గురించి తెలుసుకోవాలని.. అందుకోసం కనీసం ఒక సంవత్సరమైనా దేశంలో పర్యటించి దేశంలో ఏం జరుగుతుందో పరిశీలించాలని.. అప్పుడే ఏం చెయ్యాలో అర్ధమౌతుందని గోపాలకృష్ణ గోఖలే సలహా ఇచ్చారు. గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే సలహానుసారం ముంబై నుండి తన పర్యటన ప్రారంభించి దేశం మొతం పర్యటించారు. పర్యటన అనంతరం 1917లో బీహార్లోని చంపారన్ జిల్లా నుంచి గాంధీజీ తొలి ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమమే సత్యాగ్రహం. అనంతరం గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంతో సహా వివిధ స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయి. గాంధీజీ ఆధ్వర్యంలో భారతదేశంలో వలస పాలనకు వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. దేశంలో అంటరానితనం నిర్మూలనకు కూడా ఎనలేని కృషి చేశారు గాంధీజీ. అంటరాని తనాన్ని రూపుమాపేందుకు వాళ్ళను హరిజనులు అనిపిలవడం ప్రారంభించారు. హరిజనులు అంటే దేవుని పిల్లలు అని అయన తెలియచేసారు. భారతదేశంలో చేనేత పరిశ్రమను పునరుద్ధరించడానికి మహాత్మా గాంధీ కూడా కృషిచేశారు, ముఖ్యంగా ఖాదీపై దృష్టి పెట్టారు. అహింసను ఆయుధంగా మలుచుకుని స్వాతంత్రాన్ని సంపాదించిన గాంధీజీ పుట్టినరోజును “అంతర్జాతీయ అహింసా దినోత్సవం”గా జరుపుకుంటారు.
తాజావార్తలు
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!