Harish Rao : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అని హరీశ్ రావు అన్నారు.
Also Read : Virupaksha: సుప్రీమ్ హీరో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టాడు…
Also Read
- Canada vs Bosnia: సూపర్ సబ్ 'లారిన్' మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Homemade Collagen Drink: యవ్వనమైన చర్మానికి సహజ రహస్యం.. ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ నేచురల్ డ్రింక్!
- ENG W vs SL W: శతకంతో 'డ్యానీ వ్యాట్' వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేది.. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సిక్ ఇండస్ట్రీగా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుంది అని హరీశ్ రావు లేఖలో వెల్లడించారు.
Also Read : Sharath Babu: సీనియర్ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఈ నేపథ్యంలో ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి ప్రైవేటైజేషన్ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు అని హరీశ్ రావు అన్నారు. వారు ఆరు డిమాండ్లను నా ద్వారా మీ ముందు ఉంచుతున్నారు.
1. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
2. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.
3. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
4. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
5. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.
6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి హరీష్ రావు లేఖలో ఈ విషయాలను వెల్లడించారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
-
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
-
Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
-
Homemade Collagen Drink: యవ్వనమైన చర్మానికి సహజ రహస్యం.. ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ నేచురల్ డ్రింక్!
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!