Bengaluru: బీజేపీ అభ్యర్థి చేతిలో డిప్యూటీ సీఎం సోదరుడు ఓటమి..

Congress

Congress

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్.. బీజేపీ అభ్యర్థి సీఎన్ మంజునాథ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో.. కర్ణాటకలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా.. డీకే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి అయిన మూడుసార్లు ఎంపీగా గెలిచిన శివకుమార్‌కు ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.

Read Also: Indore: 10 లక్షలకు పైగా మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించిన అభ్యర్థి.. ఎవరో తెలుసా?

బీజేపీ అభ్యర్థి మంజునాథ్ చేతిలో సురేష్ 2,69,647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మంజునాథ్‌కు 10,79,002, సురేష్‌కి 8,09,355 ఓట్లు వచ్చాయి. మంజునాథ్, ప్రముఖ కార్డియాలజిస్ట్.. కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ గా ఉన్నారు. అంతేకాకుండా.. అతను మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ అల్లుడు.

Read Also: Nara Lokesh: బాధ్యత మరింత పెరిగిందన్న నారా లోకేష్..

కాగా.. జేడీఎస్ గతేడాది ఎన్డీఏలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. మొత్తం 28 సెగ్మెంట్లు ఉన్న కర్ణాటకలో బీజేపీ 25 నియోజకవర్గాల్లో, జేడీఎస్ మూడు స్థానాల్లో పోటీ చేశాయి. మంజునాథ్‌ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. మంజునాథ్ కోసం రాజరాజేశ్వరి నగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కూడా ప్రచారం నిర్వహించారు. మంజునాథ్ గెలిస్తే కేబినెట్ మంత్రి అవుతారని నియోజకవర్గం అంతటా ప్రచారం చేశారు. ప్రతిష్టాత్మకమైన జయదేవ ఆసుపత్రికి అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మంజునాథ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిగా నియమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మంజునాథ్‌కు పోటీదారులుగా చాలా మంది పేర్లు వినిపించాయి. మంజునాథ సిఎన్ హాసన్ జిల్లాలోని చన్నరాయపట్నంకు చెందినవాడు..