Deepavali : 24నే దీపావళి జరుపుకోవాలి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి… ఆనందాల కేళి.. దీపావళి పేరు చెబితే పిల్లలు ఎగిరి గంతేస్తారు… అయితే, ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్ధత కొనసాగుతోంది. హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అనగానే ప్రతి ఇంట వెలుగులు విరజిమ్ముతాయి. ఈ పండగ కోసం ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తిథి, నక్షత్రం ప్రకారం ఈ నెల 24న సోమవారం నాడు దీపావళి జరుపుకోవాలని చెబుతుంటే.. మరికొందరు 25వ తేదీ జరుపుకోవాలంటున్నారు. అమావాస్య రాత్రి తిథి ఉన్నందున అప్పుడే దీపావళి జరుపుకోవాలని మరికొందరు పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 24వ తేదీనే చతుర్దశి తిథి సాయంత్రం 5 గంటలలోపు ఉందని, ఆ తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4:20 గంటలకు అమావాస్య తిథి పూర్తవుతుంది. ఆ తర్వాత పాడ్యమి ప్రారంభమవుతుంది. దీపావళి పండుగకు ముందే చాలామంది ధనత్రయోదశి జరుపుకుంటారు. ఆ రోజున బంగారం కొనాలని అంటారు.
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
Read Also:Forex : ఆర్థిక నిల్వలకు ఇబ్బందిలేదు.. సమృద్ధిగా ఉన్నాయి
ఈసారి దీపావళికి ముందు రోజున 23వ తేదీన ధన త్రయోదశి ప్రారంభమవుతుంది. దీపావళి పర్వదినాన్ని ఈ నెల 24వ తేదీన జరుపుకోవాలని టీటీడీ ఆగమ సలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగం ఆచార్యులు శ్రీవిష్ణుభట్టాచార్యులు తెలిపారు. సోమవారం సూర్యాస్తమయానికి గంటముందుగా అమావాస్య ఘడియలు ప్రారంభమవుతుండడంతో అదే రోజున దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు.
దీపావళి రోజున మీ ఇంట్లో దీపాలు వెలిగిస్తే ఎంతో శుభం జరుగుతుంది. మీ ఇల్లును, మీ ఆఫీసును శుభ్రం చేయాలి. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలశక్తి వస్తుంది. దీపావళి నాడు ఇంట్లో ముఖ్యంగా వంటగది, స్టోర్ రూంను క్లీన్ చేయడం చాలామంది చేయరు. వాటిని శుభ్రంగా వుంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కొలువై వుంటుందని పండితులు చెబుతున్నారు.
దీపావళి ముందు రోజే మీ ఇంట్లో పగిలిన వస్తువులు, ఫోటోలు, చినిగిన పుస్తకాలు, పనికిరాని బొమ్మలు వుంటే బయటపడేయాలి. ఇంటి ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. కాబట్టి ఉత్తర, ఈశాన్య దిశలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోండి. ఉత్తరంలో వాస్తు దోషం ఉంటే మీరు ఎంత కష్టపడ్డా మీకు వచ్చే ఆదాయం నిలవదు. దీపావళి రోజున మీ ఇంటిని లైట్లు, పువ్వులు, రంగోలి, కొవ్వొత్తులతో డెకరేట్ చేయాలి. ఇంట్లో దీపాలు వెలుగుతుంటే.. ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని, ఆమె అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సాధ్యమయినంత కాలుష్యం తక్కువగా వుండే క్రాకర్స్ కాలిస్తే మంచిది.
Read Also: Bhakthi tv Live Stothra parayanam live: గురువారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!