కాకినాడ జిల్లా సర్పవరం లోని పోస్టల్ కాలనీ లో వీరబాబు అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నట్లు బాధితురాలు దిశ SOS కాల్ చేసింది. వెంటనే అలెర్ట్ అయిన దిశ టీం కానిస్టేబుల్, హోం గార్డ్ లను సంఘటనా స్థలానికి పంపించింది. కేవలం 5 నిముషాల వ్యవధిలో బాధితురాలి లోకేషన్ కు దిశ పోలీసులు చేరుకున్నారు. పోలీసుల రాకను కనిపెట్టిన వీరబాబు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.
Also Read : CM KCR : ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి
సర్పవరానికి చెందిన వీరబాబు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో తన వెంట పడుతున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. గత రాత్రి వీరబాబు తన ఇంటికి వచ్చి దుర్భాషలాడుతూ గొడవ పెట్టుకున్నట్లు పేర్కొంది. అడ్డువెళ్లిన తన తండ్రిని తీవ్రంగా కొట్టి గాయపరిచినట్లు చెప్పింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వీరబాబుపై కఠిన చర్యలు తీసుకుంటామని దిశ పోలీసులు పేర్కొన్నారు.
Also Read : Dehydration : బహిష్టు నొప్పికి డీహైడ్రేషన్కి సంబంధం ఉందా?