డైరెక్టర్ అనుదీప్ కేవీ అంటేనే మనకు వెన్నెల్లో గోదావరి లాంటి స్వచ్ఛమైన కామెడీ గుర్తొస్తుంది. అలాంటిది ఆయన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో, అనుదీప్ ఇప్పుడు తన తదుపరి సినిమా విషయంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారట. ఏంటీ అంటే.. ఎప్పుడూ తన మార్క్ కామెడీతోనే సినిమాలు చేసే ఆయన, ఈసారి ఆ జానర్ను పక్కన పెట్టి ఒక సీరియస్ ‘లేడీ ఓరియెంటెడ్’ కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కేవలం కామెడీని మాత్రమే నమ్ముకుంటే కెరీర్లో ఇబ్బందులు తప్పవని భావించిన అనుదీప్,
Also Read : Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుండి డబుల్ ట్రీట్.. ట్రైలర్తో పాటూ ఆ సర్ప్రైజ్ కూడా.. !
ఈసారి ఒక సామాజిక అంశాన్ని సీరియస్గా డీల్ చేయబోతున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ విభిన్నమైన ప్రాజెక్టును నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం ఈ కథకు సరిపోయే ఒక స్టార్ హీరోయిన్ కోసం చిత్ర బృందం చూస్తోందట. అది కూడా ఒక టాప్ హీరోయిన్ గనుక ఈ ప్రాజెక్టులోకి వస్తే, సినిమా రేంజ్ మారుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అనుదీప్ దగ్గర ‘జాతిరత్నాలు’ తరహాలో మరో హిలేరియస్ కామెడీ కథ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి ఈ సీరియస్ సబ్జెక్టునే పట్టాలెక్కించాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ‘రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా కంటెంట్ ఉన్న సినిమాలపై ఫోకస్ పెడుతుండటంతో, అనుదీప్ కొత్త ప్రయత్నంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఎప్పుడూ నవ్వించే అనుదీప్, ఈసారి సీరియస్ కథతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
