Indo- Canada Dispute: భారత్-కెనడా వివాదం.. పప్పు ధాన్యాల దిగుమతిపై ఎంత వరకు ప్రభావం పడనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat- Canada Dispute: భారత్- కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అక్టోబర్లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి విరామం ఇచ్చింది. ఇక భారత్ పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునే దేశాల్లో కెనడా ప్రధానమైనది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ ప్రభావం పప్పుధాన్యాల దిగుమతిపై పడనుందని అనుకుంటున్నారు.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
దీనిపై ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి క్లారిటీ ఇచ్చారు. ఇకపై పప్పు ధాన్యాల దిగుమతిపై భారత్ ఒకే దేశం పై ఆధారపడదని ఆయన పేర్కొన్నారు. కెనడా నుంచి వచ్చిన పప్పు ధాన్యాలు ఇప్పటికే చాలా వరకు భారత్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా పప్పు ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం లేదని తెలిపారు. వీటికి తోడు ఇటీవల అమెరికా నుంచి కూడా కాయ ధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధమయ్యిందని వీటిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 2022-23లో కెనడా నుంచి 11 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను ఇండియా దిగుమతి చేసుకుంది. కెనడా ప్రధాన ఎగుమతి దారుల్లో భారత్ ఒకటి. ప్రస్తుతం వివాదాల నేపథ్యంలో భారత్ ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 023 ఏప్రిల్-జూన్ కాలంలో కెనడా నుండి భారతదేశం సుమారు 0.95 లక్షల టన్నుల కాయధాన్యాలను దిగుమతి చేసుకోగా, ఆస్ట్రేలియా నుంచి 1.99 లక్షల టన్నులను దిగుమతి చేసుకుంది. అంతేకాకుండా రష్యా, సింగపూర్, టర్కీ, యూఏఈ నుంచి కూడా భారతదేశం పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి కెనడాతో విభేదాల ప్రభావం పప్పు ధాన్యాలపై పడదనే చెప్పుకోవాలి.
- Tags
- Bharat
- Canda
- dispute
- Lentil Imports
తాజావార్తలు
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!