Diabetes Care: డయాబెటిస్ను నియంత్రించుకోవాలంటే.. ఈ నాలుగు పండ్లను తినేయండి
- మధుమేహం పూర్తిగా నయం కాదు
- ఆహారపు అలవాట్లతోనే అదుపులోకి డయాబెటిస్
- జామ కివి పియర్ ద్రాక్షలు పేషెంట్లకు మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes Care: డయాబెటిస్ టైప్ 1 పూర్తిగా నిర్మూలించడానికి కుదరదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులకు ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. అయితే కొన్ని పుల్లటి, తీపి పండ్లు డయాబెటిస్ను కూడా నియంత్రించగలవు. వీటిలో అధిక మొత్తంలో సి విటమిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇలాంటి పండ్లు చాలా మేలు చేస్తాయని అనేక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఇవి షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయగలవు. బ్లడ్ షుగర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే ఆ పండ్ల గురించి మీకు చెప్తాము.
జామకాయ
జామకాయ లేదా దాని ఆకులు రెండూ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా చూస్తుంది. ఇది కాకుండా జామకాయలో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయి.
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also:Hyderabad No-1: పొదుపులో నెం.1గా భాగ్యనగర వాసులు.. ది గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వే
కివి
కివి కూడా తీపి, పుల్లని పండు. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. దీన్ని కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఈ పండు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
ద్రాక్ష
పిల్లలు ద్రాక్షపండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, కె కూడా ఇందులో ఉన్నాయి.
పియర్
పుల్లని పండ్లలో పియర్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పీచుతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
Read Also:Andhra Pradesh: తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తరలించడం సాధ్యమా?
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!