Diabetes Care: డయాబెటిస్ను నియంత్రించుకోవాలంటే.. ఈ నాలుగు పండ్లను తినేయండి
- మధుమేహం పూర్తిగా నయం కాదు
- ఆహారపు అలవాట్లతోనే అదుపులోకి డయాబెటిస్
- జామ కివి పియర్ ద్రాక్షలు పేషెంట్లకు మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes Care: డయాబెటిస్ టైప్ 1 పూర్తిగా నిర్మూలించడానికి కుదరదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులకు ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. అయితే కొన్ని పుల్లటి, తీపి పండ్లు డయాబెటిస్ను కూడా నియంత్రించగలవు. వీటిలో అధిక మొత్తంలో సి విటమిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇలాంటి పండ్లు చాలా మేలు చేస్తాయని అనేక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఇవి షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయగలవు. బ్లడ్ షుగర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే ఆ పండ్ల గురించి మీకు చెప్తాము.
జామకాయ
జామకాయ లేదా దాని ఆకులు రెండూ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా చూస్తుంది. ఇది కాకుండా జామకాయలో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయి.
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
Read Also:Hyderabad No-1: పొదుపులో నెం.1గా భాగ్యనగర వాసులు.. ది గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వే
కివి
కివి కూడా తీపి, పుల్లని పండు. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. దీన్ని కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఈ పండు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
ద్రాక్ష
పిల్లలు ద్రాక్షపండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, కె కూడా ఇందులో ఉన్నాయి.
పియర్
పుల్లని పండ్లలో పియర్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పీచుతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
Read Also:Andhra Pradesh: తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తరలించడం సాధ్యమా?
తాజావార్తలు
-
Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!