Dhurandhar : 7.5 గంటల నిడివితో ‘ధురందర్’ స్పెషల్ స్క్రీనింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ (Dhurandhar), ‘ధురందర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సినిమాల గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ రెండు భాగాలను కలిపి ఏకంగా 7 గంటల 30 నిమిషాల నిడివి గల ‘డైరెక్టర్స్ కట్’ వెర్షన్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే దాదాపు ఒక రోజులో మూడో వంతు సమయం ఈ సినిమాకే కేటాయించాలన్నమాట.
Also Read : Ranbir Kapoor: రాముడు కేవలం పాత్ర కాదు.. నా అదృష్టం!
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
కానీ ఈ సుదీర్ఘమైన ఎక్స్టెండెడ్ వెర్షన్ను కేవలం IMAX, DC, HDR మరియు EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. దర్శకుడు ఆదిత్య ధర్ షూట్ చేసిన ప్రతి సీన్ను, ఎడిటింగ్లో తీసేసిన కీలక సన్నివేశాలను కూడా ఇందులో చేర్చబోతున్నారట. హాలీవుడ్ లో ‘జస్టిస్ లీగ్’ వంటి సినిమాలకు ఇలాంటి డైరెక్టర్స్ కట్ రావడం చూశాం, కానీ ఇండియన్ సినిమాలో ఇంత లెంగ్తీ వెర్షన్ రావడం ఇదే మొదటిసారి కావచ్చు. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే, అభిమానులు ఈ సినిమాను రెండు పార్టులుగా విరామంతో చూస్తారా లేక ఒకేసారి అంతసేపు థియేటర్లలో కూర్చుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ‘ధురందర్’ యాక్షన్, విజువల్స్ పీక్స్లో ఉన్న నేపథ్యంలో, ఈ 7.5 గంటల వెర్షన్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడే క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?