ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ ఇండియన్ ఫిలిం ‘ధురంధర్ : ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 19న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే, అంతకంటే ముందే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
Also Read : Aishwarya Arjun :విజయ్ పక్కన రష్మిక ప్లేస్లో నేనుండాల్సింది.. కానీ
ఈ సినిమా నిడివి దాదాపు 4 గంటల వరకు ఉండటంతో, థియేటర్లలో షోల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, జియో స్టూడియోస్ మార్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూస్ (Paid Previews) నిర్వహించాలని నిర్ణయించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ ప్రివ్యూస్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు ‘స్త్రీ 2’ పేరిట ఉంది. కానీ, ‘ధురంధర్ 2’ కి ఉన్న హైప్ చూస్తుంటే ఆ రికార్డును ఇది ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మొదటి భాగానికి వచ్చిన పాజిటివ్ టాక్, ఇప్పుడు సెకండ్ పార్ట్పై ఉన్న భారీ అంచనాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒకవేళ ప్రివ్యూస్ నుంచే హిట్ టాక్ వస్తే, ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం.