రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా, ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘ధురంధర్ 2’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
Also Read : Meena : పెళ్లి అంటూ చేసుకుంటే అతనే చేసుకుంటా.. మీనా షాకింగ్ కామెంట్స్
ఏంటంటే రిలీజ్ అయిన ‘ధురంధర్ 2’ అఫీషియల్ పోస్టర్ చూస్తే ఒక విషయం స్పష్టమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్స్టార్ (Jio Hotstar) దక్కించుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ‘ధురంధర్’ మొదటి భాగం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సీక్వెల్ మాత్రం ప్లాట్ఫామ్ మార్చేసింది. పార్ట్ 1 ఉన్న చోటే పార్ట్ 2 కూడా ఉంటుందని అందరూ ఆశించారు, కానీ మేకర్స్ మాత్రం జియో హాట్స్టార్కే మొగ్గు చూపారు. సాధారణంగా భారీ రేటు పలకడం వల్లే ఇలాంటి మార్పులు జరుగుతుంటాయి. ‘ధురంధర్ 2’ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని జియో హాట్స్టార్ భారీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏదేమైనా రణ్వీర్ స్పై యాక్షన్ సీక్వెల్ ఇప్పుడు ఓటీటీ మార్కెట్లో గట్టిగానే చర్చకు దారితీసింది.
