రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) భారీగా కోతలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విదేశీ వెర్షన్తో పోలిస్తే, ఇండియాలో విడుదలవుతున్న వెర్షన్ దాదాపు 6 నిమిషాల కంటే ఎక్కువ నిడివి తక్కువగా ఉండటం గమనార్హం.
Also Read : Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కొన్ని దృశ్యాలు మరీ భయంకరంగా ఉన్నాయని భావించి వాటిని తొలగించమని ఆదేశించింది. సెన్సార్ నివేదిక ప్రకారం చిత్ర యూనిట్ మొత్తం 21 మార్పులు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా కళ్లను తీసేయడం వంటి అత్యంత క్రూరమైన దృశ్యాన్ని తగ్గించారు. తల నరికి తన్నడం అనే సన్నివేశంపై బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అందులోని సుమారు 24 సెకన్ల భాగాన్ని పూర్తిగా తొలగించింది. సుత్తి మరియు సిమెంట్ బ్లాక్స్తో తలలను సుత్తితో బాదడం, సిమెంట్ ఇటుకలతో కొట్టే దృశ్యాలకు సెన్సార్ అభ్యంతరం తెలిపింది.
Also Read : sreeleela : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్
కేవలం వయోలెన్స్ మాత్రమే కాకుండా సినిమాలో మరికొన్ని కీలక సవరణలు కూడా సూచించింది సెన్సార్. డీమోనిటైజేషన్ సినిమాలో సబ్టైటిల్స్లో కనిపించే నోట్ల రద్దు తేదీలను వాస్తవ తేదీలకు అనుగుణంగా సరిదిద్దాలని బోర్డు సూచించింది. అలాగే ప్రధాన మంత్రికి సంబంధించిన రిఫరెన్స్లు మరియు న్యూస్ ఫుటేజీని ఉపయోగించడానికి మేకర్స్ అధికారికంగా అనుమతి పత్రాలను సమర్పించాల్సి వచ్చింది. కొన్ని అసభ్యకర పదాలను మ్యూట్ చేయడంతో పాటు, ముగింపులో వచ్చే ఎండ్ క్రెడిట్స్ నిడివిని కూడా ఒక నిమిషం తగ్గించి భారతదేశంలో ‘ధురంధర్ 2’ 3 గంటల 49 నిమిషాల 36 సెకన్ల డ్యూరేషన్ తో వస్తుండగా ఓవర్సీస్ వెర్షన్ దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివితో అన్కట్గా ప్రదర్శితం కానుంది. ఇండియాలో ఇంత భారీ నిడివి ఉన్నప్పటికీ అద్భుతమైన కథనం కారణంగా ప్రేక్షకులకు బోర్ కొట్టదని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
