Dhulipalla Narendra: శాసనసభలో ఇదే తొలిసారి..!
- కొత్త స్పీకర్ చైర్లో కూర్చునే సమయంలో ప్రతిపక్షం లేకపోవడం ఇదే తొలిసారి
- టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు
- బీసీ వ్యక్తి స్పీకర్ అవుతుంటే అవమానించే విధంగా జగన్ వ్యవహరించారు
- ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల తనకు నమ్మకం లేదని మరోసారినిరూపించారని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhulipalla Narendra: కొత్త స్పీకర్ చైర్లో కూర్చునే సమయంలో ప్రతిపక్షం లేకపోవడం ఇదే తొలిసారి అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. బీసీ వ్యక్తి స్పీకర్ అవుతుంటే అవమానించే విధంగా జగన్ వ్యవహరించారని.. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల తనకు నమ్మకం లేదని మరోసారి జగన్ నిరూపించారు.. స్పీకర్ ఛార్జ్ తీసుకుంటుంటే మాజీ సీఎం జగన్ కానీ.. వైసీపీ సభ్యులు కానీ లేకపోవడం బాధాకరం అని అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు.. గతంలో మాకు ఎంత బాధ ఉన్నా సంప్రదాయాన్ని గౌరవించాం. ఆయన (వైఎస్ జగన్) పులివెందుల వెళ్తే.. కనీసం వైసీపీ సభ్యులైనా సభకు వచ్చుంటే బాగుండేదన్నారు. పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నికపై సమాచారం ఇచ్చాం. జగన్ తనకిచ్చిన గౌరవాన్ని నిలుపుకోవడం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పునూ వైసీపీ గౌరవించడం లేదన్నారు.
Read Also: Mallikarjun Kharge: తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
ఇక, జగన్ తనకు లేని హోదాను కోరుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చాం. సభకు రాకుండా ఉండడానికి జగన్ సాకులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు ధూళిపాళ్ల.. ఓటమిని జీర్ణించుకునే పరిస్థితుల్లో జగన్ లేరన్న ఆయన.. తమ్మినేని సీతారాంను స్పీకర్గా ఎన్నుకున్నప్పుడు అచ్చెన్నాయుడు ఆయన్ను చైరులో కూర్చొపెట్టడానికి వెళ్లారని గుర్తుచేశారు.. పరిటాల రవిని చంపినప్పుడు సభలో మేం ఆందోళన చేయాలనుకున్నాం. కానీ, చంద్రబాబు వద్దన్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాం.. వ్యవస్థలను గౌరవించాం. కానీ, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ వాకౌట్ చేశారు.. ఇదీ ఫస్ట్ టైమే అన్నారు. నిన్న జగన్ సభలోకి వచ్చినప్పుడు మా సభ్యులెవరు ఒక్క మాట కూడా అనలేదు.. అది మా హుందాతనం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..