Dhulipalla Narendra: శాసనసభలో ఇదే తొలిసారి..!
- కొత్త స్పీకర్ చైర్లో కూర్చునే సమయంలో ప్రతిపక్షం లేకపోవడం ఇదే తొలిసారి
- టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు
- బీసీ వ్యక్తి స్పీకర్ అవుతుంటే అవమానించే విధంగా జగన్ వ్యవహరించారు
- ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల తనకు నమ్మకం లేదని మరోసారినిరూపించారని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhulipalla Narendra: కొత్త స్పీకర్ చైర్లో కూర్చునే సమయంలో ప్రతిపక్షం లేకపోవడం ఇదే తొలిసారి అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. బీసీ వ్యక్తి స్పీకర్ అవుతుంటే అవమానించే విధంగా జగన్ వ్యవహరించారని.. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల తనకు నమ్మకం లేదని మరోసారి జగన్ నిరూపించారు.. స్పీకర్ ఛార్జ్ తీసుకుంటుంటే మాజీ సీఎం జగన్ కానీ.. వైసీపీ సభ్యులు కానీ లేకపోవడం బాధాకరం అని అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు.. గతంలో మాకు ఎంత బాధ ఉన్నా సంప్రదాయాన్ని గౌరవించాం. ఆయన (వైఎస్ జగన్) పులివెందుల వెళ్తే.. కనీసం వైసీపీ సభ్యులైనా సభకు వచ్చుంటే బాగుండేదన్నారు. పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నికపై సమాచారం ఇచ్చాం. జగన్ తనకిచ్చిన గౌరవాన్ని నిలుపుకోవడం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పునూ వైసీపీ గౌరవించడం లేదన్నారు.
Read Also: Mallikarjun Kharge: తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
- Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
ఇక, జగన్ తనకు లేని హోదాను కోరుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చాం. సభకు రాకుండా ఉండడానికి జగన్ సాకులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు ధూళిపాళ్ల.. ఓటమిని జీర్ణించుకునే పరిస్థితుల్లో జగన్ లేరన్న ఆయన.. తమ్మినేని సీతారాంను స్పీకర్గా ఎన్నుకున్నప్పుడు అచ్చెన్నాయుడు ఆయన్ను చైరులో కూర్చొపెట్టడానికి వెళ్లారని గుర్తుచేశారు.. పరిటాల రవిని చంపినప్పుడు సభలో మేం ఆందోళన చేయాలనుకున్నాం. కానీ, చంద్రబాబు వద్దన్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాం.. వ్యవస్థలను గౌరవించాం. కానీ, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ వాకౌట్ చేశారు.. ఇదీ ఫస్ట్ టైమే అన్నారు. నిన్న జగన్ సభలోకి వచ్చినప్పుడు మా సభ్యులెవరు ఒక్క మాట కూడా అనలేదు.. అది మా హుందాతనం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.
తాజావార్తలు
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!