Dhamaka Movie Controversy : ముగిసిన ధమాకా వివాదం.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhamaka Movie Controversy : మాస్ మాహారాజా రవితేజ, శ్రీలీల నటిస్తోన్న సినిమా ధమాకా. ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో తమను అవమానించారంటూ ఉప్పర కులస్తులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర నగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో ఉప్పర కులస్తులు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఛాంబర్ వద్ద బైఠాయించారు. ‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ లు వెంటనే క్షమాపణలు చెప్పాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేసింది.
Also Read : Varisu Movie Update: వారసుడు ఆడియో లాంచ్.. గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్న మేకర్స్
Also Read
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
ఈ క్రమంలో చిత్ర దర్శకుడు త్రినాథ రావు దిగివచ్చారు. ఉప్పర సోదరులకు దర్శకుడు త్రినాథరావు క్షమాపణ చెప్పారు. తనపై ఉన్న కోపాన్ని సినిమాపై చూపించొద్దని వేడుకున్నారు. తానూ బీసీనేనని ఉప్పరులు కూడా బీసీల్లో భాగమేనన్నారు. అక్కడితో ఆగకుండా ఉప్పర పదాన్ని బహిష్కరించాలని సూచించారు. ఇకపై రాజకీయనాయకులు, సినీ నటులు, ఇతరులు ఎవరూ ఉప్పర పదం వాడొద్దన్నారు.
మాస్ మాహారాజా రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ధమాకా ఆడియో ఫంక్షన్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ ఈవెంట్ లే డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ.. “ఏంటీ నీ ఉప్పర సోది “అంటూ కామెంట్ చేశారు. దీంతో దర్శకుడి తీరుపై ఉప్పర కులస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ ఫిలిం చాంబర్ వద్ద ఆందోళన, దిష్టి బొమ్మలను దహనం చేశారు. ‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ లు వెంటనే క్షమాపణలు చెప్పాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేసింది. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సినిమాలను ఆపేస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!