పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిందని, అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోందని యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – మా “దేవగుడి” సినిమాఅన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందనే ప్రశంసలు వస్తున్నాయి.
సినిమాలోని రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, పాటల చిత్రీకరణ బాగుందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్ గా వచ్చాయి. మంచి రేటింగ్స్ ఇచ్చారు. మా చిత్రంలో రఘు కుంచె చేసిన వీరారెడ్డి పాత్ర హైలైట్ అయ్యింది. ఆయన పర్ పార్మెన్స్ చాలా బాగుందని అంటున్నారు. అలాగే కీ రోల్స్ చేసిన అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనను కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. “దేవగుడి” సక్సెస్ తో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నారు. అన్నారు.