Post Office Scheme: అద్దిరిపోయే పోస్ట్ ఆఫీస్ పథకం.. సింగిల్ ఇన్వెస్ట్ మెంట్తో.. మీ డబ్బు డబుల్!
- మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఇన్వెస్ట్ మెంట్
- పొదుపు ఫ్యూచర్ లో అండగా స్కీమ్
- పెట్టుబడి పెడితే మీ డబ్బు డబుల్ అవడం ఖాయం
- ఎలాంటి రిస్క్ ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఇన్వెస్ట్ మెంట్. పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే పొదుపు ఫ్యూచర్ లో మీకు అండగా నిలుస్తుంది. ఆపద సమయంలో మీరు సేవ్ చేసుకున్న సొమ్ము ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఆపద సమయంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కుటుంబం అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. మరి మీరు కూడా సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ అందించే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్.
READ MORE: YS Jagan: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా చూస్తాం..
Also Read
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు డబుల్ అవడం ఖాయం. పెట్టుబడిపై మంచి రాబడిని పొందాలనుకునే వారు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఈ స్కీమ్ లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు మంచి లాభాలను అందుకోవచ్చు. ప్రభుత్వ స్కీమ్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ. 10 లక్షలు అందుకోవచ్చు. మరి ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టొచ్చు? మెచ్యూరిటీ కాలం ఎంత ఆ వివరాలు మీకోసం..
READ MORE: Chiranjeevi-Anil Ravipudi: చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్?
రూ. 5 లక్షలకు 10 లక్షలు:
పోస్టాఫీస్ అందించే పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ పాపులారిటీ పొందింది. ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక్కరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.50 శాతంగా ఉంది. ఈ పథకంలో మీరు 115 నెలలు లేదా 9 ఏళ్ల 7 నెలల్లో పెట్టుబడిని రెట్టింపు చేసుకోవచ్చు. అంటే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 2 లక్షలు అందుకోవచ్చు. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 4 లక్షలు అందుకోవచ్చు. అదే రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ ద్వారా లోన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో కిసాన్ వికాస్ పత్ర పథకం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వడ్డీ ద్వారా అధిక లాభాలను అందుకోవాలని చూసే వారికి ఈ పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నూతన సంవత్సరంలో ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేసి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ను ఉన్నతంగా మార్చుకోండి.
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?