Delhi: డ్రైవర్ పక్క సీటు.. తండ్రీకొడుకుల మధ్య వివాదం.. తండ్రిని కాల్చి చంపిన కుమారుడు..!
- ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో ఘటన
- టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో..
- తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. సంఘటనా స్థలంలోని స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి తుపాకీ, 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Thomson Smart TV: థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల.. ధర ఎంతంటే?
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
పోలీసుల కథనం ప్రకారం.. తిమార్పూర్ నివాసి సురేంద్ర సింగ్ (60) సీఐఎస్ఎఫ్ లో ఎస్ఐగా పని చేశారు. దాదాపు ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. ఇంత కాలం తిమార్పూర్లోని తన కుటుంబంతో కలిసి ఓ ప్రభుత్వ క్వార్టర్స్లో నివసించారు. ఈ ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసి తమ ప్రాంతమైన ఉత్తరాఖండ్కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం వస్తువులను తీసుకెళ్లడానికి ఒక టెంపోను అద్దెకు తీసుకున్నారు. అందులో సామాన్లు లోడ్ చేశారు. అయితే.. టెంపో ముందు సీటులో కూర్చోవాలని సురేంద్ర సింగ్ కుమారుడు దీపక్ (26) పట్టుబట్టాడు. కానీ తండ్రి నిరాకరించారు.
కోపంతో దీపక్ లైసెన్స్డ్ గన్తో తండ్రిపై కాల్పులు జరిపాడు. రాత్రి 7.30 గంటలకు పెట్రోలింగ్ పోలీసులకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఆయన ఎంఎస్ బ్లాక్ సమీపంలోకి చేరుకున్నారు. సురేంద్ర సింగ్ ఫుట్పాత్పై రక్తపు మరకలతో పడి ఉండటం చూశారు. కొంతమంది అతడి కుమారుడు దీపక్ నుంచి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వృద్ధుడిని హిందూ రావు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!