Delhi: డ్రైవర్ పక్క సీటు.. తండ్రీకొడుకుల మధ్య వివాదం.. తండ్రిని కాల్చి చంపిన కుమారుడు..!
- ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో ఘటన
- టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో..
- తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. సంఘటనా స్థలంలోని స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి తుపాకీ, 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Thomson Smart TV: థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల.. ధర ఎంతంటే?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
పోలీసుల కథనం ప్రకారం.. తిమార్పూర్ నివాసి సురేంద్ర సింగ్ (60) సీఐఎస్ఎఫ్ లో ఎస్ఐగా పని చేశారు. దాదాపు ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. ఇంత కాలం తిమార్పూర్లోని తన కుటుంబంతో కలిసి ఓ ప్రభుత్వ క్వార్టర్స్లో నివసించారు. ఈ ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసి తమ ప్రాంతమైన ఉత్తరాఖండ్కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం వస్తువులను తీసుకెళ్లడానికి ఒక టెంపోను అద్దెకు తీసుకున్నారు. అందులో సామాన్లు లోడ్ చేశారు. అయితే.. టెంపో ముందు సీటులో కూర్చోవాలని సురేంద్ర సింగ్ కుమారుడు దీపక్ (26) పట్టుబట్టాడు. కానీ తండ్రి నిరాకరించారు.
కోపంతో దీపక్ లైసెన్స్డ్ గన్తో తండ్రిపై కాల్పులు జరిపాడు. రాత్రి 7.30 గంటలకు పెట్రోలింగ్ పోలీసులకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఆయన ఎంఎస్ బ్లాక్ సమీపంలోకి చేరుకున్నారు. సురేంద్ర సింగ్ ఫుట్పాత్పై రక్తపు మరకలతో పడి ఉండటం చూశారు. కొంతమంది అతడి కుమారుడు దీపక్ నుంచి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వృద్ధుడిని హిందూ రావు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!